వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోదరుడికి సుఫారి ఇచ్చి కూతురును చంపించిన తల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mom gives contract to brother to eliminate her daughter
న్యూఢిల్లీ: కట్టుబాట్లు తప్పిందనే కారణంతో సొంత కూతురి గొంతును ఓ తల్లి తన సోదరుడితో కోయించిన సంఘటన ఫరిదాబాదులో జరిగింది. తన సోదరుడికి సుపారీ ఇచ్చి మరీ ఈ దారుణానికి ఒడిగట్టింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ దారుణం జరిగింది. ఫరీదాబాద్‌కు చెందిన పుష్పా కోహ్లీ, సురీందర్ కోహ్లి దంపతులకు ఒక కొడుకు, కూతురు కిరణ్ ఉన్నారు.

కూతురు కిరణ్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. కానీ, అది విఫలమవడంతో ఆమె పుట్టింటికి వచ్చేసి విడాకులకు దరఖాస్తు చేసింది. తల్లిదండ్రుల దగ్గర ఉంటూ స్థిరాస్తి వ్యాపారంలోకి దిగింది. ఈ క్రమంలో ఆమె మద్యపానం, ధూమపానం చేస్తుండేది. వీటికి తోడు వ్యాపారంలో తన భాగస్వామితో కిరణ్ సన్నిహితంగా ఉండటంపై పుష్పా కోహ్లి ఆగ్రహంతో రగిలిపోయేది.

కూతురికి ఎంత చెప్పినా తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో ఆమెను హతమార్చి ఇంటి పరువు కాపాడుకోవాలనుకునే నిశ్చయానికి వచ్చిందామె. జలంధర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న తన సోదరుడు కుల్వీందర్ సింగ్‌ను సంప్రదించి లక్ష రూపాయలకు బేరం కుదుర్చుకుని కూతుర్ని చంపేయడానికి ప్రణాళిక వేసింది.

గత ఏడాది డిసెంబర్ 27న భర్తను, కొడుకును భటిండాలో ఉన్న బంధువుల ఇంటికి పంపి తాను మాత్రం కూతురితో పాటు ఇంట్లో ఉండిపోయింది. ఆ రోజు సాయంత్రం కుల్వీందర్ మరో వ్యక్తితో కలిసి కిరణ్ గదిలోకి ప్రవేశించి నిర్దాక్షిణ్యంగా ఆమె గొంతు కోసేశారు. ఇద్దరు మహిళలు బురఖా ధరించి వచ్చి తన కూతుర్ని హత్య చేశారని పుష్ప పోలీసులకు చెప్పింది. అయితే దర్యాప్తులో అసలు దోషి కిరణ్ తల్లేనని తేలింది.

English summary
Pushpa gave a contract to her brother, ironically a cop, to kill her 23 year old daughter Kiran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X