పాకిస్తాన్ బోట్లో డ్రగ్స్.. 600 కోట్ల రూపాయల హెరాయిన్ సీజ్
అహ్మదాబాద్ : గుజరాత్ తీరంలో 600 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. పాకిస్తాన్కు చెందిన ఫిషింగ్ బోట్లో తరలిస్తున్న 200 కిలోల హెరాయిన్ను భారత కోస్ట్ గార్డ్ దళం సీజ్ చేసింది. డీఆర్ఐ (Directorate Of Revenue) అధికారులు, కోస్ట్ గార్డ్ సంయుక్త ఆపరేషన్లో ముఠా గుట్టురట్టైంది.
పాకిస్తాన్కు చెందిన బోట్లో భారీ ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు పక్కా సమాచారం అందింది. దాంతో కోస్ట్ గార్డ్ సిబ్బందిని అప్రమత్తం చేసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అందులోభాగంగా ఆరుగురు వ్యక్తులు వచ్చిన ఫిషింగ్ బోట్ను తనిఖీ చేయడంతో డ్రగ్స్ విషయం బయటపడింది.

పట్టుబడ్డ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాథమిక విచారణలో డ్రగ్ టెస్టింగ్ కిట్తో పాటు 195 ప్యాకెట్లలో నింపిన 200 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. గడిచిన రెండు నెలల్లో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం ఇది రెండవసారి. యాంటీ నారోటిక్స్ ఆపరేషన్లో భాగంగా ఇదివరకు కూడా పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications