ముంబైలో ఎక్స్ఈ వేరియంట్ అనుమానిత రోగి కోలుకున్నారు, భయంలేదు: ఆదిత్య థాక్రే
ముంబై: కోవిడ్ -19 వేరియంట్ కొత్త ఎక్స్ఈ సంక్రమించినట్లు అనుమానించబడిన వ్యక్తి కోలుకున్నాడని, ఆమె కాంటాక్ట్స్ ప్రతికూలంగా ఉన్నాయని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే గురువారం తెలిపారు. ఆ మహిళ నమూనాలను మరింత పరీక్ష కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనోమిక్స్ (NIBMG)కి పంపినట్లు ఆదిత్య థాకరే తెలిపారు.
The person with the suspected new variant has recovered fully & the high-risk contacts have been covid negative. The samples have been sent to NIBMG, to reconfirm the type of strain.
— Aaditya Thackeray (@AUThackeray) April 7, 2022
We are constantly working to ensure that we are all safe. I urge people to not panic
'కొత్త వేరియంట్ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి పూర్తిగా కోలుకున్నారు. హై-రిస్క్ కాంటాక్ట్లు కోవిడ్-19కి ప్రతికూలంగా ఉన్నాయి. స్ట్రెయిన్ రకాన్ని మళ్లీ నిర్ధారించడానికి నమూనాలు NIBMGకి పంపబడ్డాయి. మేము అందరం సురక్షితంగా ఉన్నామని నిర్ధారించడానికి మేము పని చేస్తున్నాము. భయపడవద్దని నేను ప్రజలను కోరుతున్నాను' అని ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు.
అంతకుముందు పరిణామాలను గమనించినట్లయితే..
భారతదేశంలో కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు నమోదైందని వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ముంబైలోని పౌర సంస్థ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(BMC) బుధవారం నగరంలో కరోనావైరస్ కొత్త XE వేరియంట్ కేసు కనుగొనబడిందని పేర్కొంది.
అయితే, ఆ రోగి నమూనా జీనోమ్ సీక్వెన్సింగ్ XE వేరియంట్ ఉనికిని సూచించడం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 50 ఏళ్ల మహిళ అయిన రోగి, వైరస్కు వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు తీసుకుందని, ఇప్పటివరకు ఎటువంటి లక్షణాలు కనిపించలేదని ముంబై పౌర సంస్థ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) బుధవారం తెలిపింది. ఆమె కూడా ఎలాంటి కోమోర్బిడిటీస్తో బాధపడదని తెలిపింది.
అయితే, రోగి నమూనాలో XE వేరియంట్ ఉనికిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు ఖండించాయి. "XE' వేరియంట్గా చెప్పబడుతున్న నమూనాకు సంబంధించి FastQ ఫైల్లను INSACOG జన్యుసంబంధ నిపుణులు వివరంగా విశ్లేషించారు, వారు ఈ వేరియంట్ జన్యుసంబంధమైన కానిస్టిట్యూషన్ 'XE' వేరియంట్ జన్యు చిత్రంతో పరస్పర సంబంధం కలిగి లేదని అంచనావేశారు అని మీడియాకు తెలిపాయి.

కాగా, BMC ప్రకారం.. వృత్తిరీత్యా కాస్ట్యూమ్ డిజైనర్ రోగి ఫిబ్రవరి 10, 2022న దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. భారతదేశానికి చేరుకున్న తర్వాత, ఆమె కోవిడ్-19కి ప్రతికూలంగా పరీక్షించబడింది. అయితే 2022 మార్చి 2న, సాధారణ పరీక్షల సమయంలో, ఆమె పాజిటివ్గా ఉన్నట్లు కనుగొనబడింది. ఆ తర్వాత ముంబై సబర్బన్ బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్లో ఆమెను క్వారంటైన్ చేశారు.
అయితే, మరుసటి రోజు, ఆమె నమూనాలు ప్రతికూలంగా వచ్చాయి. తన తాజా సెరో సర్వే నివేదికలో, ముంబై రోగుల నుంచి సెరో సర్వే కోసం పంపిన 230 నమూనాలలో, 21 ఆసుపత్రిలో చేరినట్లు BMC తెలిపింది. అయితే, ఎవరికీ ఆక్సిజన్ సపోర్ట్ లేదా ఇంటెన్సివ్ కేర్ అవసరం లేదని పేర్కొంది.
ఆస్పత్రిలో చేరిన వారిలో తొమ్మిది మంది వ్యాక్సిన్ రెండు డోస్లు తీసుకున్నారు. మిగిలిన వారందరికీ టీకాలు వేయలేదు. వారి మొదటి జబ్ తీసుకున్న రోగులలో ఎవరూ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని నివేదిక పేర్కొంది. 228 శాంపిల్స్లో ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు. ఒకటి XE వేరియంట్కి పాజిటివ్గా పరీక్షించగా, మరొకటి కప్పా వేరియంట్కి పరీక్షించబడింది. అయితే, దీనిలో ఎక్స్ఈ వేరియంట్ నిర్ధారణ తేలలేదని, అది ఎక్స్ఈ వేరియంట్ కాదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications