ఇడ్లీ కోసం స్నేహితుడినే చంపేశాడు
కోయంబత్తూరు :క్షణికావేశంలో ఏం చేస్తారో తెలియని వాళ్ళను చూస్తుంటాం. ప్రాణ స్నేహితులు చిన్న విషయానికి గొడవ పడ్డారు. ఈ గొడవ చివరికి ఓ స్నేహితుడి ప్రాణాలను తీసింది.ఇడ్లీ కోసం స్నేహితుడి ప్రాణాలను తీశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చోటుచేసుకొంది.
మరప్పన్, శర్వాణన్ అు ఇద్దరు స్నేహితులు. అయితే వీరి మద్య చిన్న గొడవ జరిగింది ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కోయంబత్తూరు కు చెందిన వీరిద్దరూ మద్యం తాగారు. అయితే మద్యం మత్తులో విచక్షణ మరిచారు. చిన్న విషయానికి గొడవపడ్డారు. ఇడ్లీలు కొనుగోలు చేసేందుకు ఇద్దరి స్నేహితుల మద్య జరిగిన గొడవ ప్రాణాల మీదికి తెచ్చింది.
శర్వాణన్ ఇడ్లీలు తెచ్చుకొనేందుకు గాను మరప్పన్ ను డబ్బులు అడిగారు. డబ్బులు ఇచ్చేందుకు మరప్పన్ నిరాకరించాడు. మద్యం మత్తులో ఉన్న వారు ఈ విషయమై గొడవపడ్డారు. మద్యం తాగిన తర్వాత గంజాయి కూడ తాగారు.శర్వాణన్ మళ్ళీ ఇడ్లీ కోసం డబ్బులు అడిగాడు. కాని, మరప్పన్ మళ్ళీ నిరాకరించాడు.
ఇడ్లీ కోసం ఇద్దరు స్నేహితుల మద్య మళ్ళీ గొడవ జరిగింది. ఈ గొడవతో ఆగ్రహనికి గురైన మరప్పన్ శర్వాణన్ ను వాటర్ ట్యాంక్ నుండి కిందకి తోసేశాడు. ఈ ఘటనలో శర్వాణన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.