Viral: రోడ్డు పక్కన నమాజ్ చేశారని ఏం చేశారంటే ?, ఎవరిని అడిగి చేశారు ?, సోషల్ మీడియాలో వైరల్ !
లక్నో/ శహజహాన్ పూర్: పలు వాహనాల్లో ముస్లీం సోదరులు వేరే రాష్ట్రంలో ఉన్న ఆజ్మీర్ దర్గాను సందర్శించడానికి బయలుదేరారు. మార్గం మద్యలో నమాజ్ చెయ్యడానికి సమయం దగ్గర పడటంతో రోడ్డు పక్కన వాహనం నిలిపారు. ముస్లీం సోదరులు శుభ్రంగా కాళ్లు, చేతులు, ముఖం కడుక్కొని రోడ్డు పక్కన నమాజ్ చేశారు. ఆ సందర్బంలో అక్కడికి వెళ్లిన ఓ వర్గం వాళ్లు రోడ్డు పక్కన నమాజ్ చేస్తారా ?, మీకు ఎంత ధైర్యం ?, మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా ? అంటూ రెచ్చిపోయారు. రోడ్డు పక్కన నమాజ్ చేసిన కొందరితో క్షమాపణలు చెప్పించడం, మరికొందరి దగ్గర గుంజీలు తీయించడం చేశారు. ఆ సందర్బంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అజ్మీర్ దర్గాకు వెళ్లాలని ?
పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు ముస్లీం సోదరులు రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు చెయ్యాలని అనుకున్నారు. ముస్లీం సోదరులు సామూహికంగా దర్గాను సందర్శించాలని అనుకుని కొంతకాలం నుంచి అందరికి అనుకూలంగా ఉన్న సమయంలోనే ఆజ్మీద్ దర్గాకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

ఉత్తరప్రదేశ్ లో ఎంట్రీ
కొన్ని వాహనాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి ముస్లీం సోదరులు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఆజ్మీర్ దర్గాను సందర్శించడానికి బయలుదేరారు ముస్లీం యాత్రికులు ఉత్తరప్రదేశ్ లోని శహజహాన్ పూర్ జిల్లాలోని తిల్లార్ ప్రాంతంలోకి వెళ్లారు. ఆ సమయంలో నమాజ్ చెయ్యడానికి సమయం దగ్గర పడటంతో ముస్లీం సోదరులు రోడ్డు పక్కన వాహనం నిలిపారు.

ఎవరిని అడిగి నమాజ్ చేశారు ?, మీకు ఎంతధైర్యం
ముస్లీం సోదరులు శుభ్రంగా కాళ్లు, చేతులు, ముఖం కడుక్కొని రోడ్డు పక్కన నమాజ్ చేశారు. ఆ సందర్బంలో వీహెచ్ పీ కార్యకర్తలు అని చెప్పుకుని అక్కడికి వెళ్లిన ఓ వర్గం వారు రోడ్డు పక్కన నమాజ్ చేస్తారా ?, మీకు ఎంత ధైర్యం ?, మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా ?, ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు, మా రాష్ట్రంలో బహిరంగంగా నమాజ్ చెయ్యడం నిషేధం అని మీకు తెలుసా అంటూ రెచ్చిపోయారని సమాచారం.

నమాజ్ చేసినందుకు గుంజీలు తీయించారు
రోడ్డు పక్కన నమాజ్ చేసిన కొందరితో క్షమాపణలు చెప్పించడం, మరికొందరి దగ్గర గుంజీలు తీయించడం చేశారు. ఆ సందర్బంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంపై శహజహాన్ పూర్ జిల్లా ఎస్పీ ఎస్. ఆనంద్ స్థానిక మీడియాకు వివరణ ఇచ్చారు. రాజస్థాన్ కు చెందిన కొందరు ఇక్కడ రోడ్డు పక్కన నమాజ్ చేశారని, ఆ సందర్బంలో వీహెచ్ పీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారని అన్నారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్
అజ్మీర్ దర్గాకు వెలుతున్న కొందరు ఫిర్యాదు చెయ్యడంతో కొందరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశామని మరో సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ వాజ్ పేయి చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. మొత్తం మీద అజ్మీర్ దగ్గరకు వెలుతున్న ముస్లీంలు రోడ్డు పక్కన నమాజ్ చేశారని ఆరోపిస్తూ వారితో గుంజీలు తీయించడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications