Cheetah: నాలుగు పిల్లలకు జన్మచ్చిన చీతా.. ట్విట్టర్లో వెల్లడించిన మంత్రి..
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతపులి ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. చిరుతల్లో ఒకటైన సాషా కిడ్నీ వ్యాధి కారణంగా మరణించిన మూడు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. చిరుతపులికి పిల్లలు పుట్టినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. "2022 సెప్టెంబర్ 17న ఇండియాకు తీసుకొచ్చినన ఓ చీతాకు నాలుగు పిల్లలు పుట్టాయని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. గతంలో జరిగిన పర్యావరణపరమైన తప్పులను సరిదిద్దతూ చీతాలను భారత్ కు తిరిగి తీసుకురావడంలో కృషి చేస్తోన్న బృందాన్ని అభినందిస్తున్నానని" అని ట్వీట్ చేశారు.
Congratulations 🇮🇳
— Bhupender Yadav (@byadavbjp) March 29, 2023
A momentous event in our wildlife conservation history during Amrit Kaal!
I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt
చనిపోయిన సాషా, మరో ఏడు పెద్ద పిల్లులతో పాటు ఆఫ్రికన్ దేశం నుంచి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ (KNP)కి తీసుకొచ్చారు. నాలుగున్నర సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆడ చిరుత సాషా చనిపోవడంతో ప్రాజెక్ట్ చీతాకు ఎదురుదెబ్బ తగిలింది. కానీ మరో చితాకు నలుగు పిల్లలు పుట్టడం శుభపరిణామం అని జూ అధికారులు తెలిపారు. ఈ జాతి చిరుత పులులు అంతరించిపోయిన ఏడు దశాబ్దాల తర్వాత, వాటిని పునరుద్దరించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

గత ఏడాది సెప్టెంబరు మధ్యలో నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకొచ్చి షియోపూర్ జిల్లాలోని కెఎన్పిలో తీసుకొచ్చారు.మిగిలిన ఏడు చిరుతలు బాగున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చిరుతల్లో మూడు మగ, ఒక ఆడ చిరుతను పార్క్లోని ఓపెన్ ఫారెస్ట్ ఏరియాలో విడుదల చేశామన్నారు. అవి పూర్తిగా ఆరోగ్యంగా, చురుకుగా, సాధారణ పద్ధతిలో వేట సాగిస్తున్నాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్-వైల్డ్ లైఫ్) జెఎస్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

గత నెలలో దక్షిణాఫ్రికా నుండి కెఎన్పికి తీసుకువచ్చిన పన్నెండు చిరుతలను ప్రస్తుతం క్వారంటైన్ ఎన్క్లోజర్లో ఉంచారు. అవి ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నాయని ఒక అధికారి పిటిఐకి తెలిపారు. భారతదేశంలోని చివరి చిరుత 1947లో ప్రస్తుత ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో మరణించింది
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications