డ్యామ్ గండికి కారణమైన పీతలను అరెస్ట్ చేయండి...! ఎన్సీపీ
మహారాష్ట్ర మంత్రి సావంత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తివారి డ్యామ్కు కారణమైన పీతాలను వెంటనే అరెస్ట్ చేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర నేతృత్వంలో థానే పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. అంతేకాదు కొన్ని పీతాలను బుట్టలో పట్టుకువచ్చి పోలీసు స్టేషన్లో అప్పగించారు.
మహారాష్ట్రాల్లో ఇటివల కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున జనజీవనం స్థంభించిన విషయం తెలిసిందే..ఈనేపథ్యంలోనే భారి వరదల రత్నగరి జిల్లాలో ఉన్న తివారి డ్యామ్కు గండిపడింది..దీంతో డ్యామ్కు దిగువన ఉన్న లోతట్లు ప్రాంతంలో నివసిస్థున్న ప్రజలు వరదల్లో గల్లంతయ్యారు. మరోవైపు డ్యామ్ దిగువన ఉన్న ఏడు గ్రామాలు నీట మునిగాయి. దీంతో వరదల్లో కొట్టుపోయిన 19మంది మృత్యువాత పడ్డారు. అయితే డ్యామ్కు గత కొద్ది సంవత్సరాలుగా మరమ్మత్తులు లేకుండా ఉండడంతో ఈ సంఘటన జరిగిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఈ నేపథ్యంలోనే వరద పరిస్థితిని సమీక్షించిన మంత్రి సావంత్ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. తివారి డ్యామ్కు గండిపడడానికి ప్రధాన కారణం పీతలే కారణం ప్రకటించాడు. దీంతో మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డ్యామ్కు గండిపడడాన్ని సమర్ధించుకుని సమస్యలను పీతాలపైకి నెట్టడాన్ని పలువురు విమర్శించారు. దీంతో ఆయనపై వ్యంగాస్త్రాలు విసిరారు ఎన్సీపీ నేతలు.












Click it and Unblock the Notifications