నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుడు అరెస్ట్..

2026 నీట్- యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణం కేసులో మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు ఒక బీఏఎంఎస్ విద్యార్థిని అరెస్ట్ చేశారు. సుమారు రూ. 10 లక్షలకు 'గెస్ పేపర్' కొనుగోలు చేసిన ఆరోపణలపై ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా మారింది. నిందితుడిని శుభమ్ ఖైర్నార్‌ గా గుర్తించారు. ఇతను టెలిగ్రామ్ ద్వారా ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసి ఆ తర్వాత హర్యానాకు చెందిన కొనుగోలుదారుడికి విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు శుభమ్ ఖైర్నార్‌ ను నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నుంచి నాలుగు బృందాలు శుభమ్ ఖైర్నార్‌ ను తమ అదుపులోకి తీసుకోవడానికి నాసిక్‌ కు చేరుకున్నాయి. ఈ తాజా అరెస్టుతో దర్యాప్తు మరింత విస్తరించింది. నాసిక్‌ లోని ప్రింటింగ్ ప్రెస్ నుండి నేరుగా పేపర్ లీక్ అయిందనే మునుపటి సిద్ధాంతంపై కొత్త సందేహాలు తలెత్తాయి. పోలీసు వర్గాల ప్రకారం.. పరీక్షా పత్రం అసలు అక్కడ ముద్రించలేదు.

ఇక నీట్-యూజీ పునఃపరీక్ష ప్రకటనపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లీకేజీ వైఫల్యానికి బాధ్యులైన అధికారులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రశ్నాపత్రాల లీకేజీ మాఫియాను అణచివేయాలని వారు డిమాండ్ చేశారు. 2024లోనూ ఇలాంటి ఘటనపై కేంద్రం మౌనం వహించడంపై విద్యార్థులు నిలదీశారు. ఈ పరిణామం విద్యార్థులలో గందరగోళం, అనిశ్చితిని సృష్టించిందని విద్యార్థి శరత్ చంద్ర కే.ఎస్. అన్నారు. "సాంకేతిక అభివృద్ధి ఉన్న ఈ యుగంలోనూ నీట్- యూజీని లీకేజీలు లేకుండా NTA నిర్వహించకపోవడం దురదృష్టకరం. ఇది విద్యార్థులపై మరింత ఒత్తిడిని పెంచుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

నీట్-యూజీ ఒక కఠినమైన పరీక్ష అని.. దాని తయారీలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని మరో విద్యార్థిని శ్వేత జీ.కీ. తెలిపింది. "చాలా మంది మళ్లీ పరీక్ష రాయడానికి సిద్ధంగా లేరు. నీట్ ప్రశ్నాపత్రాలు మాత్రమే ఇలా లక్ష్యంగా మారడం విచారకరం" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఏఐడీఎస్‌వో మైసూర్ జిల్లా కమిటీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. దాని జిల్లా కార్యదర్శి నితిన్, "పునరావృత నీట్-యూజీ లీకేజీలు కేవలం పరీక్షా సంస్థ వైఫల్యం కాదు, లక్షలాది మంది నిజాయితీగల విద్యార్థుల కృషికి, ఆశయాలకు జరిగిన తీవ్ర అన్యాయం" అని మండిపడ్డారు. ఆయన ఇంకా తెలిపారు.

NEET UG 2026 Paper Leak Scam Nashik Police Arrests BAMS Student in Maharashtra NEET-UG 2026 Paper

"మూడు సంవత్సరాలలో ఇది రెండోసారి. వైద్య విద్యను ఆశించే వారి కలలు దెబ్బతిన్నాయి. NTA కోచింగ్ మాఫియా ప్రభావంతో పనిచేస్తుందని నిదర్శనం. ఇది వ్యవస్థ క్షీణతను, విద్యార్థులలో ఆందోళన, నిరాశను పెంచుతుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. NTA ను రద్దు చేయాలి. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇవే మా డిమాండ్లు" అని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+