కీలకంగా సోలార్ పవర్: టారీఫ్ తగ్గించేందుకు మార్గదర్శకాలు
దేశ ప్రజలందరికీ 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు భారత ప్రభుత్వం ఒక మిషన్గా పనిచేస్తోంది.
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు భారత ప్రభుత్వం ఒక మిషన్గా పనిచేస్తోంది. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ను అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో సౌర విద్యుత్(సోలార్ పవర్) ఎంతో కీలకమైనది.
పర్యావరణ పరిరక్షణతోపాటు తక్కువ ధరకే విద్యుత్ అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏకంగా రూ.244కే యూనిట్ విద్యుత్ అందించేందుకు కసరత్తులు కొనసాగిస్తోంది. గత మూడేళ్లలోనే నాలుగింతలు ఎక్కువగా సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో 13.1గిగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి అయ్యింది.

పునర్వినియోగ వనరుల శాఖ.. గ్రిడ్ లకు అనుసంధానం చేసే టారీఫ్ ఆధారిత సోలార్ పవర్ ప్రాజెక్టుల బిడ్డింగ్ కోసం పలు మార్గదర్శకాలను సూచించింది. ఆగస్టు 3, 2017న ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను నోటిఫై చేసింది.
విద్యుత్ చట్టం 2003, ప్రొవిజన్స్ సెక్షన్ 63 ప్రకారం.. దీర్ఘకాలిక విద్యుత్ అవసరాల కోసం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీస్ లేదా అధికారిక ప్రతినిధులు లేదా ఇంటర్మీడియరీ ప్రొక్యురర్ సొలార్ ప్రాజెక్టుల కోసం బిడ్డింగ్లు సేకరిస్తోంది. 5మెగావాట్ల నుంచి బిడ్డింగ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications