గుండెపోటుతోనే తబ్రేజ్ అన్సారీ మృతి..!! కానీ పుర్రె ఫ్రాక్చర్, ఇతర గాయాలతోనే స్ట్రోక్
రాంచీ : జై శ్రీరాం, జై హనుమాన్ అనలేదని తబ్రేజ్ అన్సారీపై మూకదాడి చేసిన సంగతి తెలసిందే. హిందు సంస్థల దాడితో తన భర్త చనిపోయారని తబ్రేజ్ భార్య వాదిస్తుండగా .. గుండెపోటుతో చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో ఉందని పోలీసులు వెల్లడించారు. దీంతో తబ్రేజ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తాజాగా కొత్త మెడికల్ రిపోర్ట్ కూడా వచ్చింది.

అంతకుముందు ..
మూకదాడిలో తబ్రేజ్ అన్సారీ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతని పుర్రెకు ప్రాక్చర్ అయ్యింది. తీవ్రగాయాలతో ఉన్న ఆయనకు గుండెపోటు వచ్చి .. చనిపోయారని మెడికల్ రిపోర్టులో తేలింది. దీనికి సంబంధించి నివేదికను జంషెడ్పూర్ ఎంజీఎం మెడికల్ హెచ్వోడీలు ఐదుగురు ధ్రువపరుస్తూ మెడికల్ రిపోర్ట్ అందజేశారు. అన్సారీ గుండెపోటుతోనే చనిపోయారని .. కానీ దానికి అతను తీవ్రగాయాలతో ఉండటమే కారణమని పేర్కొన్నారు. గుండెపోటుతో పాటు పుర్రె కూడా ప్రాక్చర్ అయ్యిందని, శరీరంలోని మిగతా అవయవాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

విచక్షణరహితంగా ..
జూన్ 17న జార్ఖండ్లోని సరైకెల ఖార్సావన్ జిల్లాలో అతివాద గ్రూపు సభ్యులు అన్సారీని అడ్డుకొన్నారు. జై శ్రీరాం అని దాడికి తెగబడ్డారు. దీంతో అతను తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే అన్సారీ గుండెపోటుతో చనిపోయారని వైద్యులు నివేదిక ఇవ్వడంపై ఆయన భార్య తప్పుపట్టారు. తన భర్తపై కొందరు దాడిచేయడంతోనే మృతిచెందారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐదుగురు విభాగ అధిపతుల మరోసారి అన్సారీ మృతికి సంబంధించి వైద్య పరీక్షను విడుదల చేశారు. జూన్ 17న అన్సారీ చనిపోగా .. కొత్త మెడికల్ సర్టిఫికెట్ గత నెల 6న వైద్యులు విడుదల చేశారు.

పుర్రె ప్రాక్చర్ ..
పుర్రెకు ప్రాక్చర్ కావడంతో మెదడులో రక్తం కారిందని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు పుర్రె కింద రక్తం గడ్డకట్టిందని వివరించారు. అన్సారీ పుర్రెకు తీవ్రమైన గాయలయ్యాయని సీనియర్ న్యూరాలజిస్ట్ ఒకరు మీడియాకు పేర్కొన్నారు. పుర్రె ప్రాక్చర్ కావడం అనేది మైనస్ అని తెలిపారు. దీంతోపాటు అన్సారీ విష పదార్థం తీసుకున్నారని మెడికల్ రిపోర్టులో వెల్లడించడం అనుమనాలకు తావిస్తోంది. అయితే దాడికి గురైన తర్వాత ఆస్పత్రిలో చేరడంలో చూపిన నిర్లక్ష్యమే అతని ప్రాణాలను బలిగొంది. దాడి తర్వాత వైద్యులను కలిసిన అన్సారీ .. తన కాలుకు మాత్రమే దెబ్బ తగిలిందని చెప్పారు. మిగతా చోట్ల గాయాలు కాలేదని చెప్పి .. దెబ్బలను దాచి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

ఒత్తిడికి గురై ..
తలపై దెబ్బ తగలడంతో మనిషి ఒత్తిడికి గురవుతుంటారు. దెబ్బ తగలినా ట్రీట్ మెంట్ చేయించుకోకపోవడం అన్సారీ చేసిన తప్పయింది. పుర్రెకు గాయమైతే ఊపిరితిత్తులు, గుండెపై ఆ ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు. శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా .. గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం తప్పనిసరి చూపిస్తోందని డాక్టర్ మర్ది పేర్కొన్నారు. మూకదాడిలో అన్సారీ చనిపోతే పోలీసులు మాత్రం గుండెపోటుతో చనిపోయారని పేర్కొన్నారు. దీంతో 11 మందిపై హత్య కేసులను వెనక్కి తీసుకొని తమ స్వామిభక్తిని ప్రదర్శించారు. కానీ దాడితోనే తన భర్త చనిపోయారని స్పష్టంచేశారు. దీంతో మరోసారి వైద్యులు రిపోర్ట్ ఇచ్చినా .. గుండెపోటుతోనే చనిపోయారని కానీ .. దాడితో గాయాలతో మృతిచెందారని చెప్పడం ఆమె ఆరోపణలకు బలం చేకూరింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications