వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిల్‌సుఖ్‌నగర్‌లో బ్లాస్ట్స్: ఐఈడీ బాంబులు, పాక్‌నుండే

By Srinivas
|
Google Oneindia TeluguNews

 NIA files chargesheet on DSNR bomb blasts
హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్‌లో ఐఈడీ బాంబులు తయారు చేసి పెట్టారని జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) చెప్పింది. గత సంవత్సరం హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్లో జంట పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి దర్యాఫ్తు సంస్థ అదికారులు పలువురిని అరెస్టు చేశారు. నిందితుల్లో భత్కల్ సోదరులు ఉన్నారు. ఎన్ఐఏ రెండో ఛార్జీషీటు వేసింది.

పాకిస్తాన్ నుండి రియాజ్ భత్కల్ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని ఎన్ఐఏ తేల్చింది. త్వరలో భత్కల్ పైన ఛార్జీషీటు వేస్తామని తెలిపింది. పేలుడు పదార్థాలతో బాంబులు తయారు చేసేవారని పేర్కొంది.

పేలుడు పదార్థాలను బెంగళూరుకు పంపించారని, అక్కడి నుండి హైదరాబాదుకు తీసుకు వచ్చారన్నారు. బెంగళూరు నుండి హైదరాబాదుకు పేలుడు పదార్థాలను వకాస్, తహసీన్ తరలించారని తేల్చారు. దిల్‌సుఖ్ నగర్లో ఐఈడీ బాంబులు తయారు చేసి పెట్టారని చెప్పారు.

English summary
NIA files second chargesheet on Dilsukha Nagar bomb blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X