ABP-CVoter Opinion Poll: నితీశ్కే బీహరీల మొగ్గు.. తేజస్వీతో 10 శాతం ఓటు తేడా..
బీహర్లో తొలి విడత ఎన్నిక మరో 4 రోజుల్లో జరగబోతుంది. అయితే బీహరీల నాడీ ఎలా ఉందో తెలిపేందుకు సంస్థలు సర్వే చేపట్టాయి. అయితే ఏబీపీ సీ ఓటర్ అంచనా వేసింది. 29.5 శాతం మంది బీహరీలు తిరిగి నితీశ్ కుమార్ సీఎం పదవీ చేపట్టాలని కోరుకుంటున్నారని పేర్కొన్నది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సీఎం కావాలని 19.9 శాతం ఆకాంక్షిస్తున్నారని తెలియజేసింది. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ 9.8 శాతం మంది మాత్రమే అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారని వివిరించింది
చిరాగ్ పాశ్వాన్ సీఎం కావాలని 13.8 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారని చెప్పింది. అయితే 15 ఏళ్ల జేడీయూ, 15 ఏళ్ల ఆర్జేడీ పాలనపై కూడా సర్వే చేపట్టింది. అయితే అందులో ఈస్ట్ బీహర్, మగద్-భోజ్ పూర్, మిథిలాంచల్, సీమాంచల్, నార్త్ బీహార్ మాత్రం జేడీయూ బాగా పాలించిందని తెలిపింది. 61.6 శాతం మంది నితీశ్ పాలనకు జై కొట్టారు.

Recommended Video
అయితే ఓటు శాతంలో ఆర్జేడీ ముందువరసలో ఉంది. 46 శాతం ఓట్లతో ఆర్జేడీ ఉండగా.. ఎన్డీఏ 28 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఎల్జేపీ 4 శాతం.. ఇతరులు 22 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడించింది. బీహర్లో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. తొలుత ఈ నెల 28వ తేదీన ఎన్నికలు ప్రారంభమవుతాయి. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు.












Click it and Unblock the Notifications