సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట: అప్పటి వరకు చర్యలు వద్దని స్పీకర్‌కు ఆదేశం

జైపూర్: కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత సచిన్ పైలట్‌కు రాజస్థాన్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. జులై 21 వరకు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తోపాటు 18 ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సచిన్ పైలట్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాదులు

సచిన్ పైలట్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాదులు


సచిన్ పైలట్ సహా 18 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహిత్గీ వాదించారు. జులై మొదటి వారంలో జరిగిన కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ సమావేశానికి గైర్హాజరైన నేపథ్యంలో సచిన్ పైలట్ తోపాటు 18 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

జులై 21 వరకూ సచిన్, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై చర్యలొద్దు

జులై 21 వరకూ సచిన్, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై చర్యలొద్దు


జులై 21 వరకు సచిన్ సహా 18 మంది రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మోహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తాలతో కూడిన రాజస్థాన్ హైకోర్టు ధర్మాసనం రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌కు స్పష్టం చేసింది. కాగా, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర సీపీ జోషీ తరపున అభిషేక్ మను సింఘ్వీ జులై 20న తన వాదనలను కోర్టులో వినిపించనున్నారు.

సచిన్ కోసం కాంగ్రెస్ ద్వారాలు తెరిచేవున్నాయి..

సచిన్ కోసం కాంగ్రెస్ ద్వారాలు తెరిచేవున్నాయి..

కాగా, కీలక నేత అయిన సచిన్ పైలట్‌, ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పటికే ద్వారాలు తెరిచేవున్నాయని కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగాక, సచిన్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేయవద్దని కూడా స్పష్టం చేస్తున్నారు.ఇది ఇలావుండగా,రాజస్థాన్ అసెంబ్లీ కాంగ్రెస్ విప్ మహేష్ జోషీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ) పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిగిన కుట్రలు టెలిఫోన్ ఆడియో టేపుల్లో బయటపడ్డాయని తన ఫిర్యాదులో జోషీ తెలిపారు.

Recommended Video

    Audio Tapes కలకలం... Congress దూకుడు, రెబల్‌ ఎమ్మెల్యేల కు Show Cause Notices, BJP వ్యూహం ?
    గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలేదు

    గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలేదు

    అయితే, తాము గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేయలేదని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. తమకు ఆ ఉద్దేశం కూడా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనవసర, అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. వైరల్ అవుతున్న ఆ ఆడియో టేపులు నకిలీవని అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సచిన్ పైలట్‌ను బీజేపీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, సచిన్ మాత్రం తాను బీజేపీలో చేరడం లేదని ప్రకటించారు. సచిన్ కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+