RG Kar: ఎన్ని చట్టాలు వచ్చినా ఆగని వేధింపులు..!
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఇటీవల మహిళా ట్రైనీ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. దీంతో దేశంలోని వైద్యులు, సాధారణ ప్రజలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 31 ఏళ్ల పోస్ట్గ్రాడ్యుయేట్ ట్రైనీ ఆగస్ట్ 9న ప్రభుత్వ ఆసుపత్రి సెమినార్ హాల్లో అర్ధ నగ్న స్థితిలో కనిపించింది. అయితే ఆమె అప్పటికే చనిపోయింది. మొదటగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.
ఆ తర్వాత ఆమె అత్యాచారం జరిగిందని పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ కేసును కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి బదిలీ చేసింది.2012లో ఢిల్లీలో 23 ఏళ్ల మహిళ(నిర్భయ)పై సామూహిక అత్యాచారం, హత్య తర్వాత గణనీయమైన చట్టపరమైన సంస్కరణలు ఉన్నప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం మహిళాలపై దాడులు పెరుగుతోన్నాయి.

2022లో 31,000 పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. 12 ఏళ్లలోపు బాధితులకు సంబంధించిన కేసుల్లో కనీసం 10 ఏళ్ల శిక్ష, జీవిత ఖైదు లేదా మరణశిక్షతో సహా కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టినప్పటికీ నేరాలు తగ్గడం లేదు. ఎన్సిఆర్బి డేటా ప్రకారం 2018 నుంచి 2022 వరకు 27 శాతం రేప్ కేసులలో శిక్షా రేటు తక్కువగానే ఉంది. 2018లో మధ్య భారతదేశంలో ఒక పసికందుపై అత్యాచారం మరియు హత్య చేసినందుకు అరెస్టు చేసిన మూడు వారాలకే 26 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించారు.
2019లో హైదరాబాద్లోని 27 ఏళ్ల పశువైద్యురాలిపై అత్యాచారం చేసి చంపినట్లు అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసు అధికారులు ఎన్ కౌంటర్ చేశారు. 2020లో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారంపై ఆందోళనలు చెలరేగాయి.
-
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications