ఒబామా పర్యటన: ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత (ఫోటోలు)
న్యూఢిల్లీ: జనవరి 27న పర్యాటకులకు తాజ్ మహల్ సందర్శనను నిలిపివేయనున్నారు. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భారత్ పర్యటనలో జనవరి 27న తాజ్ మహల్ను సందర్శించనున్నారు.
రిపబ్లిక్ డే పరేడ్ వేడుకులకు ప్రత్యేక అతిథిగా బరాక్ ఒబామా వస్తుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా కనీవినీ ఎరుగని భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఆగ్రాలో భారీగా భద్రతా దళాలను మోహరించారు. ప్రత్యేకించి సీసీ టీవి కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఒబామా పర్యటన నేపథ్యంలో ఆగ్రా మొత్తం సీఏఎస్ఎఫ్ బలగాల చేతిలోకి వెళ్ళింది. తాజ్ మహల్ ఉండే ప్రాంతంలో స్పెషల్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ వేడుకులకు వస్తున్న తొలి అమెరికా అధ్యక్షుడు కూడా బరాక్ ఒబామానే కావడం విశేషం. అంతేకాకుండా జనవరి 26న రాజ్పథ్, ఇండియా గేట్ల వద్ద కూడా సందర్శకులను అనుమతించరు.
ఇక రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలు జరగనున్న రాజ్పథ్ మార్గంలో గగన తలాన్ని ప్రత్యేక రాడార్తో పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే అమెరికా సిబ్బంది ఢిల్లీ, ఆగ్రాలో సెక్యూరిటీ ఏర్పాట్లను చూస్తున్నారు. రాజ్పథ్లో జరిగే రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలలో పాల్గొంటున్న ఒబామా రెండు గంటల కంటే ఎక్కువ సేపు బహిరంగ వేదికపై ఉంటారు.

ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత
జనవరి 27న పర్యాటకులకు తాజ్ మహల్ సందర్శనను నిలిపివేయనున్నారు. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భారత్ పర్యటనలో జనవరి 27న తాజ్ మహల్ను సందర్శించనున్నారు.

ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత
రిపబ్లిక్ డే పరేడ్ వేడుకులకు ప్రత్యేక అతిథిగా బరాక్ ఒబామా వస్తుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా కనీవినీ ఎరుగని భద్రతా చర్యలు చేపడుతున్నారు.

ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత
ప్రత్యేకించి సీసీ టీవి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒబామా పర్యటన నేపథ్యంలో ఆగ్రా మొత్తం సీఏఎస్ఎఫ్ బలగాల చేతిలోకి వెళ్ళింది. తాజ్ మహల్ ఉండే ప్రాంతంలో స్పెషల్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు.

ఈనెల 27న తాజ్ మహల్ సందర్శన నిలిపివేత
రిపబ్లిక్ డే పరేడ్ వేడుకులకు వస్తున్న తొలి అమెరికా అధ్యక్షుడు కూడా బరాక్ ఒబామానే కావడం విశేషం. అంతేకాకుండా జనవరి 26న రాజ్పథ్, ఇండియా గేట్ల వద్ద కూడా సందర్శకులను అనుమతించరు.
అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటనలో మొత్తం 15,000 కొత్త సీసీటీవీ కెమెరాలను దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. వీటిలో 100 కెమెరాలు ముఖాలను గుర్తిస్తాయి. వీటిలో ఉగ్రవాదులు, అనుమానితుల ఫొటోలు ఫీడ్ చేసి ఉంటాయి. ఆ ముఖాలను పోలినవి కనబడితే.. సెక్యూరిటీ సిబ్బందికి ఇవి సంకేతాలిస్తాయి.
ఈ వేదికపైకి వచ్చే సమయంలో ఒబామా తన అధికార బుల్లెట్ ప్రూఫ్ వాహనం 'బీస్ట్'లో రాకుండా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాహనంలో వస్తే అది కూడా ఒక రికార్డ్ అవుతుంది. ఈ కార్యక్రమంలో వీవీఐపీలు కూర్చునే ప్రాంతమంతా ఏడు అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఒబామా భద్రతపై అమెరికా, భారత నిఘా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
-
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications