తెలంగాణాలో ఉక్కపోతలు, అకాలవర్షాలు.. నేడు ఈ జిల్లాలలో వానలు.. ఎల్లో అలెర్ట్!

తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అసాధారణ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పగటి సమయంలో తీవ్రమైన ఎండలు, సాయంత్రం వేళల్లో హఠాత్తుగా భారీ వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ప్రజల దైనందిన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తోంది. భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని అనేక జిల్లాలకు జూన్ 6 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అకాల వర్షాలు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి.

ఈ జిల్లాలలో ఎండల తీవ్రత

పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, ములుగు వంటి జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత ఐదేళ్లలో ఈ సీజన్‌లోనే అత్యధిక వడదెబ్బ మరణాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. రైతులు, వివిధ పనులు చేసుకునే సామాన్యులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Telangana weather conditions daytime heat sudden unseasonal heavy rains this is latest condition

సాయంత్రం వేళలలో అకాల వర్షాలు

మరోవైపు సాయంత్రం వేళల్లో ఆకాశం నల్లగా మారి గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల కల్లాల్లో నిల్వ ఉన్న ధాన్యం, మార్కెట్ యార్డుల్లో ఉన్న పంటలు తడిసి ముద్దవుతున్నాయి. రవాణా వాహనాల్లో ఉన్న ధాన్యం కూడా నష్టపోయింది. రైతులు తమ కష్టార్జితమైన పంటలు కళ్ల ముందు నాశనమవడం చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

నేడు ఈ జిల్లాలలో అకాల వర్షాలు

ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేటి వాతావరణ హెచ్చరికల ప్రకారం రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు సాయంత్రం సమయంలో అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, ఓపెన్ ప్రదేశాలు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం తీసుకోవద్దని అధికారులు సూచించారు.

నిమ్స్ లో త్వరలో ఆత్యాధునిక క్యాన్సర్ లిక్విడ్ బయాప్సి.. ఉచిత సేవలు!
నిమ్స్ లో త్వరలో ఆత్యాధునిక క్యాన్సర్ లిక్విడ్ బయాప్సి.. ఉచిత సేవలు!

రుతుపవనాల విషయంలో నిపుణుల అంచనా.. రైతులకు మార్గదర్శకాలు

నైరుతి రుతుపవనాలు రావడానికి ఇంకా 10 రోజులకు పైగా సమయం పట్టవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 6 తర్వాత వాతావరణం కొంత స్థిరత్వం చెందే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రైతుల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవసరమైన మార్గదర్శకాలు అందించాల్సిన అవసరం ఉంది.ఈ విధంగా తెలంగాణలో ఎండలు, వర్షాల మధ్య వాతావరణం ఊహించని మార్పులకు లోనవుతోంది. ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం, రైతులు పంటలను రక్షించుకోవడానికి తగిన చర్యలు చేపట్టడం అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+