Naveen PatnaiK: అనారోగ్యం వార్తలపై నవీన్ పట్నాయక్ క్లారిటీ-మోడీ కామెంట్స్ పై స్పందన..!
ఎప్పుడూ కూల్ గా కనిపించే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇవాళ తన సహజ శైలికి భిన్నంగా ప్రధాని మోడీపై పైర్ అయ్యారు. ఒడిశాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తన ఆరోగ్యంపై అనుమానాలు కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై నవీన్ మండిపడ్డారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవీన్ స్పందించారు. తన ఆరోగ్యంపైనా క్లారిటీ ఇచ్చారు.
ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రధాని మోడీ ప్రకటనపై ఆయన స్పందించారు. ప్రధాని ఓ బహిరంగ సభలో తన ఆరోగ్యం బాగోలేదని, దీనిపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఆయన తన ఆరోగ్యంపై అంతలా ఆందోళన చెందుతుంటే ఫోన్ కాల్ చేసి ఉండాల్సిందంటూ చురకలు అంటించారు. దానికి బదులు తాను అనారోగ్యంగా ఉన్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు.

#WATCH | Bhubaneswar: On PM Modi's statement to form a special committee to investigate Odisha CM Naveen Patnaik's deteriorating health, he says, "I understand that the Prime Minister, in a public meeting, has stated that I am in a bad health and he wants to institute an inquiry… pic.twitter.com/PzeoXEv41L
— ANI (@ANI) May 29, 2024
పదేళ్లుగా తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, గత నెల రోజులుగా తన సొంత రాష్ట్రంలో ప్రచారం కూడా చేస్తున్నాను అని ప్రధాని మోడీకి నవీన్ పట్నాయక్ గుర్తుచేశారు. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం ఇప్పటికే పాతికేళ్లుగా అధికారంలో ఉంది. మరోసారి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ అనారోగ్యంగా ఉన్నారని, దీనిపై పూర్తి వివరాలు బయటికి రావడం లేదని, దీనిపై విచారణ చేయిస్తామంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. వయోవృద్ధుడైన నవీన్ పట్నాయక్ ఇక పాలించలేరని, ఈసారి తమను ఎన్నుకోవాలని మోడీ ఓటర్లను కోరారు. దీనిపై నవీన్ ఫైర్ అయ్యారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications