ఢిల్లీలో కూలిన భవనం, ఒకరు మృతి, సిలిండర్ పేలుడు వల్లే
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మోతీనగర్లో మూడంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్లో పోలీసులకు స్థానికులు సైతం సహాయం అందజేస్తున్నారు. బుధవారం ఉదయం ఏడుగంటల ప్రాంతంలో భవనం కుప్పకూలినట్లు సమాచారం.

గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల భవనం కుప్పకూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడిని 20 ఏళ్ల వయస్సు గల ఆనంద్ శశినాథ్గా గుర్తించారు.
సంఘటనా స్థలం నుంచి అందరినీ ఖాళీ చేయించారు. అయితే, ఓ చిన్నారి శిథిలాల కింద ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. గాయపడినవారిలో ఓ మహిళ, ముగ్గురు పిల్లలున్నారు. వారు అద్దెకు ఆ భవనంలో ఉంటున్నారు.
More From
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications