రావత్ కు పద్మవిభూషణ్- ఆజాద్ కు పద్మభూషణ్ : ఐటీ - టీకా అధిపతులకు సైతం- తెలుగు వారిలో..!!
కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. విధి నిర్వహణలో అశువులు బాసిన సీడీఎస్ హోదాలో మరణించిన బిపిన్ రావత్ కు కేంద్రం పద్మ విభూషన్ తో గౌరవించింది. అదే విధంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కు సైతం మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. మహరాష్ట్ర నుంచి ప్రభా ఆత్రే..యూపీకే చెందిన రాధే శ్యామ్ ఖేమాకు సైతం పద్మ విభూషణ్ ప్రకటించారు.
రాజకీయ ప్రముఖుల పేర్లతో
ఇక, పద్మ భూషణ్ ప్రకటించిన వారిలో అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. పశ్చిమ బెంగాల్ నుంచి బుద్దదేవ్ భట్టాచార్య ఉన్నారు. అదే విధంగా విక్టర్ బెనర్జీ.. పంజాబ్ కు చెందిన గుర్మీత్ బవా కు సైతం ప్రకటించారు. వీరితో పాటుగా నటరాజన్ చంద్రశేఖరన్.. భారత్ బయెటెక్ అధిపతులు క్రిష్ణా సుచిత్ర...క్రిష్ణా ఎల్లా పేర్లు సైతం ప్రకటించారు. టెక్ దిగ్గజాలు సత్య నాదెళ్ల... సుందర్ పిచయ్ కు సైతం భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది. సీరమ్ సంస్థకు చెందిన సైరస్ పూనావాలా కూడా ఉన్నారు. 107 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.
తెలుగు వారికి పద్మ భూషణ్ అవార్డులు
అందులో పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ లో పాట పాడిన దర్శనం మొగిలయ్య కు పద్మశ్రీ ప్రకటించారు. తెలంగాణ నుంచి పద్మజా రెడ్డి.. రామచంద్రయ్య ఉన్నారు. ఇక, ఏపీ నుంచి సహస్రావధాని గరికపాటి నర్సింహారావు... వైద్య రంగం నుంచి సుంకర వెంకట ఆదినారాయణ.. గోసవీడు షేక్ హుస్సేన్ (మరణానంతరం) పేర్లు ప్రకటించారు. భారత్ బయోటెక్ నుంచి కరోనా వేళ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తితో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించారు. అదే విధంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసిన సీరం సంస్థ అధినేతలను పద్మభూషణ్ తో భారత ప్రభుత్వం గౌరవించింది.
టెకీ అధిపతులకు పద్మభూషన్లు
ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి టెకీ సంస్థలైన మైక్రోసాఫ్ట్..గుగూల్ సీఈఓ గా ఎన్న సత్య నాదెళ్ల... సుందర్ పిచయ్ లకు సైతం భారత్ ప్రభుత్వం పద్మభూషణ్ కు ఎంపిక చేసారు. వారిద్దరూ భారతీయలుగా దేశ ప్రతిష్ఠను ఇనుమండించేలా అగ్రశ్రేణి ఐటీ సంస్థలకు అధిపతులుగా ఉన్నారు. ఇక, దేశ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన పలువురిని సైతం పద్మ అవార్డులతో గౌరవం పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ సారి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.