అమెరికా ఆయుధాలతో పహల్గాం ఉగ్రదాడి? దర్యాప్తులో షాకింగ్ ! రంగంలోకి ఎన్ఐఏ..!
జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన పాక్ ఉగ్రమూకల దాడి దేశాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. ఇందులో బయటపడుతున్న విషయాలు దేశ ప్రజలను షాక్ కు గురి చేస్తున్నాయి. దాడి జరిగిన విధానంతో పాటు అందులో వాడిన ఆయుధాలపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఇందులో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆయుధాలతో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పహల్గాంలో జరిగిన దాడిపై దర్యాప్తు సంస్థలు అందించిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కనీసం నలుగురు ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి బైసారన్ గడ్డి మైదానానికి వచ్చినట్లు తేలింది. అలాగే వీరు అమెరికన్ తయారీ ఎం4 కార్బైన్ అస్సాల్ట్ రైఫిల్స్ , అలాగే ఏకే-47 లతో కాల్పులు జరిపారని వెల్లడైంది. ఈ దాడి జరిగిన రోజు సాయంత్రం ఘటనా స్థలం నుండి 50-70 ఉపయోగించిన కాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నారు.

దీంతో అమెరికా ఆయుధాలతో ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడినట్లు అర్దమవుతోంది. అయితే వీరికి అమెరికా ఆయుధాలు ఎలా లభించాయన్న దానిపై చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇలా జరిగే అవకాశం లేదు. దీంతో జమ్మూ-కాశ్మీర్ పోలీసులు చేస్తున్న దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి అప్పగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడి బాధితులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరు తీవ్రవాదులు సహా మొత్తం నలుగురు విదేశీయులు ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. వీరంతా సైనికుల్ని పోలిన దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులు, ఎం4 కార్బైన్ అస్సాల్ట్ రైఫిల్స్ను తీసుకువెళుతుండగా, మిగిలిన ఇద్దరు ఏకే 47లను తీసుకువెళుతున్నారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
-
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ












Click it and Unblock the Notifications