Politics: ఏసీ రూమ్ లో శుత్రువు పక్క కుర్చీలోనే ఉన్నాడు, చెడపకురా చెడేవు అంటే అక్షరాలా ఇదే !
పంజాబ్/న్యూఢిల్లీ: పంజాబ్ లో మేమే అధికారంలోకి వస్తామని ఇంతకాలం ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకున్నారు. అయితే కాంగ్రెస్ కు కాంగ్రెస్ శత్రువు అనే సామెతను మరోసారి రుజువు చేసి చూపించిన పంజాబ్ లోని ఆ పార్టీ నాయకులు సొంత పార్టీని ఇంటికి పంపించేస్తున్నారు. చెడపకురా చెడేవు అంటూ పెద్దలు చెప్పిన సామెత ఇప్పుడు అక్షరాలా పంజాబ్ లోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు వర్తించింది. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాల కారణంగా ఇంతకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్నీ సర్దుకుని ఇంటికి వెళ్లడానికి సిద్దం అయ్యింది. ఇంతకాలం ఢిల్లీకి మాత్రమే పరిమితం అయిన అమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యింది. పంజాబ్ లో అరవింద్ కేజ్రీవాల్ వారసుడిగా కామిడీ కింగ్ భగవంత్ మన్ సీఎం కుర్చీలో కుర్చోవడానికి సిద్దం అవుతున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ మార్క్ రాజకీయాలు కాకుండా తాను సొంతంగా నిర్ణయాలు తీసుకుని ప్రజల సమస్యలు, వారి కష్టాలు తీర్చడానికి ప్రయత్నిస్తానని ఎన్నికల సమయంలోనే పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మన్ ప్రజలకు హామీ ఇచ్చారు. పంజాబ్ లోని అన్ని పార్టీల నాయకులతో చక్కటి అనుబంధం ఉన్న ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ఆడినట్లు ఆడుతారా ?, సొంతంగా ఆయన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తారా ?, ప్రతిపక్షాల దెబ్బను ఎలా తట్టుకుంటారు ? తదితర సవాళ్లు అయన ముందుకు వస్తున్నాయి.
Recommended Video
BJP vs SP: సన్యాసి సీఎం ఎందుకు అన్నారు, సంసారి సీఎం ఎందుకు ?, మోదీ, యోగీ దెబ్బతో మైండ్ బ్లాక్ !
శత్రువులు ఎక్కడో లేరు..... పక్కసీట్లోనే ఉన్నారు
పంజాబ్ లో మేమే అధికారంలోకి వస్తామని ఇంతకాలం ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకున్నారు. అయితే కాంగ్రెస్ కు కాంగ్రెస్ శత్రువు అనే సామెతను మరోసారి రుజువు చేసి చూపించిన పంజాబ్ లోని ఆ పార్టీ నాయకులు సొంత పార్టీని ఇంటికి పంపించేస్తున్నారు.
చెడపకురా..... చెడేవు అంటే అక్షరాలా ఇదే
చెడపకురా చెడేవు అంటూ పెద్దలు చెప్పిన సామెత ఇప్పుడు అక్షరాలా పంజాబ్ లోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు వర్తించింది. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాల కారణంగా ఇంతకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్నీ సర్దుకుని ఇంటికి వెళ్లడానికి సిద్దం అయ్యింది.
సీఎం VS సిద్దూ
పంజాబ్ లో సీఎంకు, మాజీ క్రికెటర్ సిద్దూ ఆడిన మైండ్ గేమ్ లో కఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంది. ఇంతకాలం ఢిల్లీకి మాత్రమే పరిమితం అయిన అమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యింది. పంజాబ్ లో అరవింద్ కేజ్రీవాల్ వారసుడిగా కామిడీ కింగ్ భగవంత్ మన్ సీఎం కుర్చీలో కుర్చోవడానికి సిద్దం అవుతున్నారు.
నా మార్క్ రాజకీయాలు చూస్తారు అంటున్న కామిడీ కింగ్
అయితే అరవింద్ కేజ్రీవాల్ మార్క్ రాజకీయాలు కాకుండా తాను సొంతంగా నిర్ణయాలు తీసుకుని ప్రజల సమస్యలు, వారి కష్టాలు తీర్చడానికి ప్రయత్నిస్తానని ఎన్నికల సమయంలోనే పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మన్ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే తన కామిడీ టైమింగ్ తో ఇంతకాలం అభిమానులను ఆకట్టుకున్న భగవంత్ మన్ ఇప్పుడు రాజీకాయల్లో ప్రజలు ఎలా ఆకట్టుకుంటారో అనే విషయం వేచి చూడాలి.
లీడర్లు అందరూ క్లోజ్..... కానీ ఆడుకుంటే మాత్రం ?
పంజాబ్ లోని అన్ని పార్టీల నాయకులతో చక్కటి అనుబంధం ఉన్న ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ఆడినట్లు ఆడుతారా ?, సొంతంగా ఆయన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తారా ?, ప్రతిపక్షాల దెబ్బను ఎలా తట్టుకుంటారు ? తదితర సవాళ్లు అయన ముందుకు వస్తున్నాయి.