Parliament: లోక్ సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్-చొరబాటుపై రచ్చరచ్చ..!
నిన్న పార్లమెంటులోకి ఇద్దరు అగంతకులు చొరబడి రచ్చరచ్చ చేసిన వ్యవహారంపై ఇవాళ ఉభయసభలూ దద్దరిల్లాయి. కేంద్రం దీనిపై సమాధానం చెప్పాలని కోరుతూ ఇరు సభల్లోనూ విపక్షాలు పట్టుబట్టాయి. హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేశాయి. అయితే బీజేపీ ఎంపీలు దీన్ని తిప్పికొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో ఉభయసభలు వరుసగా వాయిదాలు పడుతున్నాయి. ఇదే క్రమంలో లోక్ సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల్ని ఈ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల 11వ రోజు అయిన ఇవాళ నిన్న భద్రతా ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో ఉభయ సభలు వాయిదాలు పడుతూ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి సమావేశమయ్యాయి. అనంతరం కూడా ఉభయ సభల్లో 'పీఎం సదన్ మే ఆవో (ప్రధాని సభకు రావాలి), అమిత్ షా శరం కరో' (అమిత్ షా సిగ్గుపడాలి) అంటూ నినాదాలు చేస్తూ విపక్ష నేతలు నిరసన తెలిపారు.

ఈ గందరగోళం మధ్య దుష్ప్రవర్తన కారణంగా టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ను సెషన్ పూర్తయ్యే వరకూ సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది. రాజ్యసభ ఛైర్ జగ్దీప్ ధన్కడ్ ఓబ్రియాన్ ప్రవర్తన అమాయకమైన దుష్ప్రవర్తన, అవమానకరమైన సంఘటన అని పేర్కొన్నారు. అటు లోక్ సభలో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, డీన్ కురియకోస్, జోతి మణి, రమ్య హరిదాస్లను సస్పెండ్ చేశారు.
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ సవరణ అనంతరం క్రిమినల్ లా బిల్లులను చర్చ కోసం ప్రవేశపెట్టనున్నారు. మూడు కొత్త క్రిమినల్ చట్ట బిల్లులు భారతీయ న్యాయ సంహిత, 2023, ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో; భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కోసం మరియు భారతీయ సాక్ష్య బిల్లు, 2023, భారతీయ సాక్ష్యాధారాల చట్టం, ప్రస్తుత చట్టాల స్థానంలోకి రానున్నాయి.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications