లోక్ సభ నుంచి మరో 33మంది ఎంపీల సస్పెన్షన్- 47కు చేరిన ఎంపీల బహిష్కరణలు..
పార్లమెంట్ లో చొరబాట్ల వ్యవహారం ఇవాళ కూడా ఉభయసభల్ని కుదిపేసింది. దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తున్న ఎంపీలకు సమాధానం చెప్పాల్సిన కేంద్రం తప్పించుకుంటోంది. ఇవాళ కూడా విపక్ష ఎంపీలు నిరసనకు దిగడంతో ఉభయసభల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎంపీలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన లోక్ సభ స్పీకర్ .. వారు వినకపోవడంతో మరో 33 మంది ఎంపీల్ని ఇవాళ సస్పెండ్ చేశారు.

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై నిరసన చేపట్టి ఇవాళ లోక్ సభ నుంచి సస్పెండైన విపక్ష ఎంపీల్లో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ సహా మొత్తం ముప్పై మూడు మంది ఉన్నారు. ఇవాళ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు వీరిపై ఈ సెషన్ ముగిసేవరకూ సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలేఖ్ అనే ముగ్గురు ఎంపీలు స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. అనంతరం ఎంపీల సస్పెన్షన్ ను సభ ఆమోదించి రేపటికి వాయిదా పడింది.
గతవారం పార్లమెంట్ లోకి నలుగురి చొరబాటు తర్వాత లోక్ సభలో చెలరేగిన నిరసనల్లో 14 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. వీరిలో 9 మంది కాంగ్రెస్ ఎంపీలే ఉన్నారు. పార్లమెంట్ లో చొరబాటుకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వీరు నిరసనకు దిగడంతో స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం ఇవాళ మరోసారి ఇవే ఘటనలు రిపీట్ కావడంతో మరో 33 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీంతో లోక్ సభ నుంచి సస్పెండైన విపక్ష ఎంపీల సంఖ్య 47కు చేరింది. రాజ్యసభ నుంచి గతవారం టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెండ్ అయ్యారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications