టెక్కి ప్రభాకు అంతిమ వీడ్కోలు: కడసారి తల్లిని చూసిన మేఘన (పిక్చర్స్)
బెంగళూరు: ఆస్ట్రేలియాలో దుండగుల చేతిలో హత్యకు గురైన మహిళ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ప్రభా అరుణ్ కుమార్ కు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, సదానందగౌడ, పార్లమెంట్ సభ్యురాలు శోభకరందాజ్లే, కర్ణాటక హొంశాఖ మంత్రి కే. జే. జార్జ్, సమాచార శాఖ మంత్రి రోషన్ బేగ్, బెంగళూరు మేయర్ శాంతకుమారి, మాజీ మంత్రి వి. సోమణ్ణ తదితరులు టెక్కి ప్రభా పార్థీవ శరీరానికి నివాళులు అర్పించారు.
గత శనివారం ఆస్ట్రేలియాలోని సిడ్నిలో మహిళ టెక్కి ప్రభాను దుండగులు హత్య చేశారు. ఆస్ట్రేలియా నుండి శనివారం రాత్రి పోద్దు పోయిన తరువాత ప్రభా భర్త అరుణ్ కుమార్ సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రత్యేక విమానంలో ప్రభా పార్థీవ శరీరాన్ని బెంగళూరుకు తీసుకు వచ్చారు. తరువాత ఇక్కడి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రం నుండి చంద్రాలేఔట్ సమీపంలోని బాపూజీ నగరలోని అరుణ్ కుమార్ సమీప బంధువు జయచంద్ర ఇంటిలో ప్రభా మృతదేహాన్ని పెట్టారు.
జయచంద్ర ఇంటికి చేరుకున్న ప్రముఖులు ప్రభా మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభాను హత్య చేసిన వారిని త్వరగా పట్టుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి మనవి చేశామని గుర్తు చేశారు. నిందితులను అరెస్టు చెయ్యాలని అక్కడి ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నదని, ఇప్పటికే విదేశాంగ మంత్రి సుస్మాస్వరాజ్ పలు సార్లు అక్కడి అధికారులతో మట్టాడారని చెప్పారు.
ప్రభా కుటుంబ సభ్యులకు పలువురు సానుభూతి తెలిపారు. తరువాత దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలుకా కల్లడ్య సమీపంలోని అమ్దూరు గ్రామానికి (ప్రభా పుట్టిన సోంత ఊరు)కు ప్రభా మృతదేహాన్నితీసుకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం ప్రభా అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ప్రభా భర్త అరుణ్ కుమార్, కుమార్తె మేఘన, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. వారిని ఓదార్చడం స్థానికులకు కష్టం అయ్యింది.
టెక్కి ప్రభాకు అంతిమ వీడ్కోలు: కడసారి తల్లిని చూసిన మేఘన
పార్లమెంట్ సభ్యురాలు శోభా కరందాజ్లే టెక్కి ప్రభాను అంతిమదర్శనం చేసుకున్నారు.
టెక్కి ప్రభాకు అంతిమ వీడ్కోలు: కడసారి తల్లిని చూసిన మేఘన
కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ ప్రభాకు నివాళులు అర్పిస్తున్న దృశ్యం
టెక్కి ప్రభాకు అంతిమ వీడ్కోలు: కడసారి తల్లిని చూసిన మేఘన
ప్రభా మృతదేహాం దగ్గర రోదిస్తున్న కుటుంబ సభ్యులు
టెక్కి ప్రభాకు అంతిమ వీడ్కోలు: కడసారి తల్లిని చూసిన మేఘన
కర్ణాటక హొం శాఖ మంత్రి జార్జ్, సమాచార శాఖ మంత్రి రోషన్ బేగ్ తదితరులు నివాళులు అర్పించారు.
టెక్కి ప్రభాకు అంతిమ వీడ్కోలు: కడసారి తల్లిని చూసిన మేఘన
ప్రభా భర్త అరుణ్ కుమార్ తో మాట్లాడి ఓదార్చుతున్న ఎంపీ. శోభా కరందాజ్లే తదితరులు
టెక్కి ప్రభాకు అంతిమ వీడ్కోలు: కడసారి తల్లిని చూసిన మేఘన
ప్రభా మృతదేహాం దగ్గర రోదిస్తున్నప్రభా భర్త అరుణ్ కుమార్, కుటుంబ సభ్యులు
టెక్కి ప్రభాకు అంతిమ వీడ్కోలు: కడసారి తల్లిని చూసిన మేఘన
ప్రభా పార్థీవ శరీరం దగ్గర కుటుంబ సభ్యలు ఎర్పాటు చేసిన ప్రభా చిత్రపఠం
టెక్కి ప్రభాకు అంతిమ వీడ్కోలు: కడసారి తల్లిని చూసిన మేఘన
బెంగళూరు మేయర్ శాంతకుమారి, మాజీ మంత్రి సోమణ్ణ, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తదితరులు పభ్రా భర్త అరుణ్ కుమార్ ను ఓదార్చారు.
టెక్కి ప్రభాకు అంతిమ వీడ్కోలు: కడసారి తల్లిని చూసిన మేఘన
కర్ణాటక హొం శాఖ మంత్రి జార్జ్, సమాచార శాఖ మంత్రి రోషన్ బేగ్, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి తదితరులు పభ్రా భర్త అరుణ్ కుమార్ కు ధైర్యం చెప్పారు.
టెక్కి ప్రభాకు అంతిమ వీడ్కోలు: కడసారి తల్లిని చూసిన మేఘన
దుండగుల చేతిలో హత్యకు గురైన టెక్కి ప్రభాకు సాటి ఉద్యోగులు అంతిమ విడ్కోలు పలికారు.