Couple: పక్కాప్లాన్ తో టైమ్ చూసి దంపతులను ఒకేసారి చంపేశారు !
బెంగళూరు/చిత్రదుర్గ: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా జీవించారు. దంపతుల పిల్లలకు వివాహం అయ్యి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. దంపతులు సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. వ్యాపారం చేస్తున్న భర్త ఆయన భార్యతో సంతోషంగా జీవిస్తున్నారు. దంపతులు ఒకేసారి హత్యకు గురికావడం కలకలం రేపింది.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హోసదుర్గా పట్టణంలోని వినాయక లేఔట్ లో ప్రభాకర్ శెట్టి (75), విజయలక్ష్మి (65) దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రభాకర్ శెట్టి, విజయలక్ష్మి దంపతుల పిల్లలకు వివాహం అయ్యి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. విజయలక్ష్మి, ప్రభాకర్ దంపతులు సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు.
ప్రభాకర్ శెట్టి కొన్ని కంపెనీల ఏజెన్సీలు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. ప్రభాకర్ శెట్టి, విజయలక్ష్మి దంపతులు మాత్రమే ఇంటిలో ఉంటున్నారని, ఎవరు ఇంటిలో ఉండరని తెలుసుకున్న నిందితులు వారిని హత్య చేసి డబ్బు, నగలు లూటీ చెయ్యాలని అనుకున్నారు. కొంతకాలం నుంచి దంపతులను హత్య చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.
Singer: నాలుగు రాష్ట్రాలు, ఆరు మంది భార్యలు, ఈ సింగర్ పోటుగాడు, పైగా సిద్దాంతాలు, ఎలా చేశాడంటే ?
రాత్రి ఇంటిలోకి వెళ్లిన నిందితులు ప్రభాకర్ శెట్టి, విజయలక్ష్మి దంపతులను దారుణంగా హత్య చేశారు. ప్రభాకర్ శెట్టి, విజయలక్ష్మి దంపతుల ఇంటిలోని బంగారు నగలు, నగదు లూటీ చేసి పరారైనారు. కచ్చితమైన సమాచారంతోనే ప్రభాకర్ శెట్టి, విజయలక్ష్మి దంపతులనను హత్య చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.