శశికళకు ఊరట: తమకూరు జైలుకు తరలింపు పిటిషన్ కొట్టేసిన కోర్టు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను తుమకూరు జైలుకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటీషనను హైకోర్టు.
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను తుమకూరు జైలుకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటీషనను హైకోర్టు కోర్టు కొట్టివేసింది. తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి కోర్టులో ఈ పిటీషన్ వేసిన విషయం తెలిసిందే.
పరప్పన అగ్రహార జైలు తమిళనాడు రాష్ట్రానికి సమీపంలో ఉండటంతో తరచూ తమిళ ప్రజా ప్రతినిధులు జైలుకు వెళుతుంటారని పిటీషనలో ఆయన పేర్కొన్నారు. జైలు నుంచే తమిళనాడు పాలనకు దిశానిర్దేశం జరుగుతోందని, కనుక తుమకూరు జైలుకు శశికళను బదిలీ చేయాలని పిటీషన్లో పేర్కొన్నారు.

దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటీషన్ను కొట్టివేసింది. నిబంధనలకు అనుగుణంగానే ఆమెను కలిసేవారికి అనుమతులు ఉంటాయని అందరికీ అవకాశం ఉండదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో శశికళ పరప్పన అగ్రహార జైలులోనే గడపనున్నారు.












Click it and Unblock the Notifications