Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యానిమేషన్, గేమింగ్ రంగంలో భారత్ విజయాలు.. మోదీ మన్ కీ బాత్ హైలైట్స్ ఇవే!!

భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో 115వ ఎపిసోడ్ లో మోడీ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో అనేక కీలక విషయాల గురించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి అక్టోబర్ 31న జరుగుతుందని అలాగే లార్డ్ బిర్సా ముండా 150వ జయంతి నవంబర్ 15వ తేదీన జరుగుతుందని పేర్కొన్న మోదీ వారి గొప్పతనాన్ని గుర్తు చేశారు.

అభివృద్ధిలో భారతదేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు
గత ఏడాది నవంబర్ 15వ తేదీన లార్డ్ బిర్సా ముండా జన్మదినం సందర్భంగా తాను ఆయన జన్మస్థలమైన జార్ఖండ్ లోని ఉలిహతు గ్రామానికి వెళ్లానని తెలిపారు. ఇక ఆ ప్రయాణం తనపైన చాలా ప్రభావం చూపించిందని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. ప్రతి యుగంలోనూ భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పిన ప్రధాని మోదీ అభివృద్ధిలో భారతదేశం అన్ని ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ స్థానానికి చేర్చడమే తన లక్ష్యమని తెలిపారు.

PM Modi Mann Ki Baat Highlights India s achievements in animation and gaming

రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు
ఈ సందర్భంగా మోదీ ఆయన మనసులోని భావాలను పంచుకుంటూ దీపావళి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల జరిగిన రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని మోదీ పేర్కొన్నారు. ఇక యానిమేషన్ రంగంలో విప్లవం తీసుకురావడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.

యానిమేషన్ ప్రపంచంలో విప్లవం
చోట భీమ్ లాగా ఇతర యానిమేషన్ సిరీస్ కృష్ణ, బాల హనుమాన్, మోటు పట్లు వంటి వాటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని, భారతదేశంలోని యానిమేటెడ్ పాత్రలు సినిమాలు, వాటి కంటెంట్ లో ప్రత్యేకమైనవని మోదీ అన్నారు. యానిమేషన్ రంగంలో భారతదేశం ఒక విప్లవాన్ని తీసుకురావడానికి తనవంతుగా కృషి చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. యానిమేషన్ ప్రపంచంలో మేడిన్ ఇండియా, మేడ్ బై ఇండియా మెరుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

గేమింగ్ రంగంలోనూ భారత్ ప్రగతి
ఇక భారత్లో గేమింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత క్రీడలు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు . ఇక భారతదేశం టెక్నాలజీ అభివృద్ధిలో కూడా గణనీయంగా ప్రగతి సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ అతిపెద్ద దేశంగా భారత్
భారతదేశం ఇప్పుడు మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ అతిపెద్ద దేశంగా అవతరించిందని, వాటిని 85 దేశాలకు ఎగుమతి చేస్తున్న దేశంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని మోదీ పేర్కొన్నారు. ఇవి మాత్రమే కాదు పిల్లల ఫిట్నెస్ పైన అధిక శ్రద్ధ చూపించడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+