ఆతృతతో: జపాన్ భాషలో మోడీ ట్వీట్, ఫ్రెండ్స్కి థ్యాంక్స్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తన ట్విట్టర్ అకౌంటులో జపాన్ భాషలో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోడీ ట్విట్టర్లో స్పందిస్తూ... జపాన్ దేశీయులతో జపాన్ భాషలో నేరుగా మాట్లాడవచ్చు కదా అని జపాన్లోని కొందరు మిత్రులు తనకు సూచించారని చెప్పారు.
తాను జపాన్ భాషలో రాసేందుకు తనకు సూచనలు ఇచ్చిన మిత్రులు సహకరించాలని మోడీ చెప్పారు. వారికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
కాగా, నరేంద్ర మోడీ ఈ నెల ఆఖరులో జపాన్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు మోడీ జపాన్లో పర్యటిస్తారు.
ఈ సందర్భంగా మోడీ జపాన్ భాషలో ట్వీట్ చేస్తూ.. జపాన్ ప్రధానమంత్రి షింజో ఎబెను కలిసేందుకు తాను ఆతృతతో ఉన్నానని, తాను షింజో యొక్క నాయకత్వ లక్షణాలను గౌరవిస్తానని చెప్పారు. జపానీయుల సృజన, నైపుణ్యం, సూక్ష్మదృష్టి ప్రశంసనీయమన్నారు. జపాన్, భారత్లు ఒకరి నుండి ఒకరు ఎన్నో నేర్చుకోవాలన్నారు.