వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎన్ అత్యున్నత పర్యావరణ పురస్కారాన్ని అందుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం "ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు"అందుకున్నారు. ఈ అవార్డును న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు ప్రధాని మోడీ. మోడీకి పర్యావరణంపై పూర్తి అవగాహన ఉందని ఈ క్రమంలోనే పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు మానవాళికి ప్రమాదకరంగా పరిగణించాయని గుర్తించారని గుటెరెస్ అన్నారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేతలకు కూడా వాతావరణంలో మార్పుల వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తెలుసు కానీ.... దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ప్రధాని మోడీ మాత్రం దీన్ని గుర్తిండంతోపాటు చర్యలు కూడా తీసుకున్నారని అదీ ఇతర నాయకులకు ప్రధాని మోడీకి ఉన్న తేడా అని అన్నారు.

ప్రధాని మరో అఛీవ్‌మెంట్ప్రధాని మరో అఛీవ్‌మెంట్

సెప్టెంబర్ 26న మోడీకి ఐక్యర్యాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ప్రకటించింది. 73వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ అవార్డును మోడీకి ప్రకటించడం జరిగింది. ఈ అవార్డును తనకు బహుకరించినందుకు ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు వచ్చిన అవార్డు దేశానికి అంకితం చేస్తున్నట్లు చెప్పిన ప్రధాని ప్రకృతితో భారత్ మమేకమైందని చెప్పారు. ప్రకృతిలోకానీ పర్యావరణంలో కానీ చోటుచేసుకుంటున్న మార్పులతో పేద ప్రజలే బాధితులుగా మారుతున్నారని చెప్పారు ప్రధాని. ఇతర పనులపై ఎంత శ్రద్ధ అయితే పెడుతామో అదే పర్యావరణ పరిరక్షణపై కూడా పెట్టాలని మోడీ కోరారు.

PM Modi recieves UN award from Secretary General Antonio Guterres

పర్యావరణ మార్పు అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకత్వ లక్షణాలు ప్రదర్శించినందుకు గానూ భారత ప్రధాని మోడీతో పాటు... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్‌ను ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుకు ఎంపిక చేసింది ఐక్యరాజ్యసమితి. ఇండియాలో 2022 కల్లా ప్లాస్టిక్ వినియోగం నిషేధించాలని మోడీ దేశంతో ప్రతిజ్ఞ చేయించారు.

English summary
Prime Minister Narendra Modi received the UNEP Champions of the Earth award, UN’s highest environmental honour, from the UN Secretary General Antonio Guterres in New Delhi on Wednesday.Guterres said PM Modi recognised the fact that climate change poses a direct existential threat to us. “He knows what we need to do to avoid a catastrophe. Other leaders also recognise, know and understand, but the difference is that he not only recognizes but he acts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X