నూతన పార్లమెంట్ వద్ద 6.5 మీటర్ల పొడవైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై వేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించారు. ప్రభుత్వ అధికారుల ప్రకారం.. ఈ చిహ్నం మొత్తం 9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తుతో కాంస్యంతో రూపొందించబడింది.
ఇది కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ ఫోయర్ పైభాగంలో వేయబడింది. చిహ్నానికి మద్దతుగా 6,500 కిలోల బరువున్న ఉక్కుతో కూడిన సహాయక నిర్మాణాన్ని నిర్మించినట్లు వారు తెలిపారు.
ప్రారంభోత్సవం సందర్భంగా, కొత్త పార్లమెంటు నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు.
The National Emblem is made of bronze with a total weight of 9500 Kg and is 6.5 m in height. It has been cast at the top of the Central Foyer of New Parliament Building. A supporting structure of steel weighing around 6500 Kg has been constructed to support the Emblem. pic.twitter.com/mG587dwZYM
— DD News (@DDNewslive) July 11, 2022
కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై జాతీయ చిహ్నం కాన్సెప్ట్ స్కెచ్, కాస్టింగ్ ప్రక్రియ క్లే మోడలింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ నుంచి కాంస్య కాస్టింగ్, పాలిషింగ్ వరకు ఎనిమిది వేర్వేరు దశల తయారీలో సాగిందని వారు తెలిపారు.
అంతకుముందు రోజు, రైతులు, ఇతర వ్యవసాయ సంఘాలు హాజరైన సహజ వ్యవసాయ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. అనంతరం జార్ఖండ్లోని డియోఘర్ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించారు.