Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Modi Elephant Safari: ఏనుగుపై మోడీ సఫారీ-కజిరంగా జాతీయ పార్కులో..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ అసోంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత కజిరంగా జాతీయ పార్కును సందర్శించారు. అక్కడ ఏనుగులతో కలిసి కాసేపు గడిపారు. అనంతరం ఏనుగుపై సఫారీ కూడా చేశారు.

మావటి వాడు, పార్క్ డైరెక్టర్ తో కలిసి ఏనుగుపై ఎక్కి కాసేపు పార్కులో కలియ తిరిగారు. ఆ తర్వాత ఏనుగులకు చెరుకు గడలు తినిపించారు. అక్కడే ఉన్న వనదుర్గ గార్డులతో కాసేపు ముచ్చటించారు. పార్కులో పరిస్దితుల్ని అడిగి తెలుసుకున్నారు.

pm modi visits kaziranga national park and took elephant safari

అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తొలిసారి సందర్శించారు. పార్క్ లో ఆయన ఏనుగు, జీప్ సఫారీలో ప్రయాణించారు. అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అందించిన వివరాల ప్రకారం 1957 తర్వాత యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌ను సందర్శించిన మొదటి ప్రధాని ఆయనే. మోదీ మొదట ఏనుగు సఫారీ చేశారు. ఆ తర్వాత నేషనల్ పార్క్ సెంట్రల్ కోహోరా పరిధిలో ఉన్న మిహిముఖ్ ప్రాంతంలో జీప్ సఫారీ చేశారు.

pm modi visits kaziranga national park and took elephant safari

"కాజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించి, దాని ప్రకృతి దృశ్యాల అసమానమైన అందాలను, అస్సాం ప్రజల వెచ్చదనాన్ని అనుభవించాలని నేను మీ అందరినీ కోరుతున్నాను" అని ప్రధాన మంత్రి మోడీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

"ఇది ప్రతి సందర్శన ఆత్మను సుసంపన్నం చేసే ప్రదేశం, అస్సాం హృదయంతో మిమ్మల్ని లోతుగా కలుపుతుంది," అని తెలిపారు. కజిరంగా జాతీయ పార్కులో లఖిమాయి, ప్రద్యుమ్న, ఫూల్మాయి అనే మూడు ఏనుగులకు ప్రధాన మంత్రి చెరుకు తినిపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+