Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Modi: జీ7 సమ్మిట్‌కు ప్రధాని మోడీ.. 5 రోజుల పాటు 3 దేశాల పర్యటన

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపటి నుంచి ఐదు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. 3 దేశాలలో పర్యటించనున్నారు. ప్రధాని ముందుగా సైప్ర‌స్‌కు వెళ్తారు. అక్కడ వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఆ తర్వాత కెనడాకు చేరుకుని జీ7 సమ్మిట్‌లో పాల్గొననున్నారు. దీనితో పాటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం చర్చలు జరపనున్నారు. పర్యటన మూడో దశలో ప్రధాని మోడీ జూన్ 18న క్రొయేషియాకు వెళ్లి జూన్ 19న భారత్‌కు తిరిగి రానున్నారు.

ప్రధాని మోడీ జూన్ 15 నుంచి 19 వరకు విదేశీ పర్యటనలో ఉండనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్, కెనడా, క్రొయేషియాను అధికారికంగా సందర్శించనున్నారు. ఈ పర్యటన మూడు దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, యూరోపియన్ యూనియన్, ప్రపంచ వేదికలలో భారత పాత్రను మరింత చురుకుగా చేయడానికి ఒక కీలక అడుగుగా పరిగణించబడుతుంది.

PM Modi s 5 Day 3 Nation Tour Attending G7 Summit and Strengthening Bilateral Ties

సైప్రస్ పర్యటన ఇలా..
రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోడీ జూన్ 15-16న సైప్రస్‌కు అధికారిక పర్యటనకు వెళ్తారు. గత రెండు దశాబ్దాలలో భారత ప్రధానమంత్రి సైప్రస్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది.నికోసియాలో ప్రధానమంత్రి మోడీ అధ్యక్షుడు క్రిస్టోడౌలైడ్స్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. లిమాసోల్‌లో వ్యాపార నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. మధ్యధరా ప్రాంతం, యూరోపియన్ యూనియన్‌తో భారతదేశ భాగస్వామ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది.

కెనడా పర్యటన.. ఆరోసారి జీ-7 సమ్మిట్‌కు హాజరు
పర్యటన రెండో దశలో ప్రధాని మోడీ కెనడాకు చేరుకుంటారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ జూన్ 16-17న కననాస్కిస్‌లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోడీ వరుసగా ఆరోసారి జీ-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోడీ జీ-7 దేశాలు , ఆహ్వానించబడిన ఔట్రీచ్ దేశాలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతో శక్తి భద్రత, సాంకేతికత, ఆవిష్కరణ, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, క్వాంటం టెక్నాలజీకి సంబంధించిన సమస్యలపై చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి అనేక ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహిస్తారు.

క్రొయేషియాలో భారత ప్రధానమంత్రి మొదటి పర్యటన
పర్యటన చివరి దశలో ప్రధాని మోడీ జూన్ 18న క్రొయేషియాకు అధికారిక పర్యటనకు వెళ్తారు. రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియా ప్రధానమంత్రి ఆండ్రే ప్లేంకోవిచ్ ఆహ్వానం మేరకు ఇది భారత ప్రధాని మొదటి పర్యటన అవుతుంది. ఇది రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ముఖ్యమైన విజయం అవుతుంది. ప్రధాని మోడీ క్రొయేషియా ప్రధాని ప్లేంకోవిచ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిచ్‌తో సమావేశమవుతారు. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ భాగస్వామ్య దేశాలతో భారత సంబంధాలను మెరుగుపరుస్తుంది. క్రొయేషియా పర్యటన అనంతరం జూన్ 19న ప్రధాని మోడీ తిరిగి భారత్‌కు రానున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+