పాక్ ప్రధాని షరీఫ్ తల్లికి మోడీ పాదాభివందనం
న్యూఢిల్లీ: పాక్లో ఆకస్మిక పర్యటించిన భారత ప్రధాని నరేంద్రమోడీకి అపూర్వ స్వాగతం, ఆతిథ్యం లభించింది. పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్, మోడీ కోసం ప్రత్యేక వంటకాలను తయారు చేయించారు. శుక్రవారం సాయంత్రం లాహోర్ నగర శివారు రాయ్విండ్లోని నవాజ్ షరిఫ్కు చెందిన జతీ ఉమ్రాహ్ ప్యాలెస్కు ప్రధాని మోడీ వెళ్లారు.
పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ కొడుకు హాసన్, ఇతర కుటుంబ సభ్యులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. షరీఫ్ తన కుటుంబ సభ్యులను మోడీకి పరిచయం చేశారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని తల్లి అక్కడికి రాగా మోడీ ఆమెకు పాదాభివందనం చేసినట్లు పాక్ వర్గాలు తెలిపాయి.

పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ తన నివాసంలో మోడీకి ఏర్పాటు చేసిన విందులో ఆయనకు ఇష్టమైన పాలకూరతో పాటు సాగ్, దాల్, శాకాహార వంటకాలను వండించారు. ప్రధాని మోడీకి ప్రత్యేకంగా కశ్మీరీ టీ అందజేశారు. శుక్రవారం షరిఫ్ పుట్టిన రోజుతో పాటు ఆయన మనవరాలు మొహ్రున్నిసా వివాహం కావడంతో మనవరాలికి మోడీ తన ఆశీస్సులను తెలిపారు.
ముందుగా లాహోర్ వెళ్లిన మోడీకి విమానాశ్రయంలో నవాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఇద్దరూ ప్రత్యేక హెలికాప్టర్లో లాహర్లోని నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లారు. షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ, అనంతరం లాహోర్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు.
తెలుగు వన్ఇండియా
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications