Political war: పప్పులో కాలేసిన బెంగళూరు ఎంపీ, యోగికి బదులు అఖిలేష్ పొగిడేసి, కౌంటర్ దెబ్బకు !
లక్నో/బెంగళూరు: దేశంలోని అందరి కళ్లు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీదే పడ్డాయి. ఉత్తరప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రావాలని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పెద్దలు, ఎన్ డీఏ మిత్రపక్షాలు ఉత్తరప్రదేశ్ లో జోరుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసింది. బీజేపీ యువమోర్చ అధ్యక్షుడు, బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ తేజస్వి సూర్యా సైతం ఉత్తరప్రదేశ్ లో జోరుగా ప్రచారం చేస్తున్నాడు. బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను టార్గెట్ చేసుకుని విమర్శించడానికి ప్రయత్నించి పప్పులో కాలేశాడు. ఎవరినైతో విమర్శించాలని ప్రయత్నించాడో (అఖిలేష్ యాదవ్) ఆయన్ను తేజస్వి సూర్యా పోగుడుతూ ట్విట్ చెయ్యడంతో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దీపం వెనక చీకటి ఉన్నట్లు ఈ తేజస్వి సూర్యా చీకటిలో ఉన్నాడని, ఆయన తెలీసి తెలియని వ్యాఖ్యలు చేస్తున్నాడని, అతను ఓ అజ్ఞాని అంటూ చురకలు అంటించడం ఇప్పడు హాట్ టాపిక్ అయ్యింది.
Illegal affair: మంచం కింద భర్త, మంచం మీద ప్రియుడితో భార్య, ఫినిష్, 7 ఏళ్లకు అడ్డంగా!
లక్నో- ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవే
బీజేపీ యువమోర్చ అధ్యక్షుడు, బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ తేజస్వి సూర్యా సైతం ఉత్తరప్రదేశ్ లో జోరుగా ప్రచారం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా- లక్నో ఎక్స్ ప్రెస్ హైవే రహదారిలో కారు నడుపుకుంటూ వెళ్లిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా ఆగ్రా నుంచి కనౌజ్ కు యోగీ ఆదిత్యానాథ్ జీ ఎక్స్ ప్రెస్ హైవే మీద దూసుకు వెలుతున్నారని, ఆయనే సీఎం అవుతారు అని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ లీడర్ అఖిలేష్ యాదవ్ ను టార్గెట్ చేసుకుని ట్విట్ చేశారు.
పప్పులో కాలేసిన బీజేపీ ఎంపీ
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను టార్గెట్ చేసుకుని విమర్శించడానికి ప్రయత్నించి పప్పులో కాలేశాడు. ఎవరినైతో విమర్శించాలని ప్రయత్నించాడో (అఖిలేష్ యాదవ్) ఆయన్ను తేజస్వి సూర్యా పోగుడుతూ ట్విట్ చెయ్యడంతో వైరల్ అయ్యింది.
చురకలు అంటించిన మాజీ సీఎం
విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దీపం వెనక చీకటి ఉన్నట్లు ఈ తేజస్వి సూర్యా చీకటిలో ఉన్నాడని, ఆయన తెలీసి తెలియని వ్యాఖ్యలు చేస్తున్నాడని, అతను ఓ అజ్ఞాని అంటూ చురకలు అంటించడం ఇప్పడు హాట్ టాపిక్ అయ్యింది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించింది మీ యోగి ఆదిత్యనాథ్ కాదని, నేను అధికారంలో ఉన్న సమయంలో 2017లో ఆ ఎక్స్ ప్రెస్ హైవేని ప్రజలకు అంకితం చేశామనే విషయం తెలుసుకోవాలని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బెంగళూరు దక్షిణ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యాకు సోషల్ మీడియాలోనే కౌంటర్ ఇచ్చారు.
అఖిలేష్ యాదవ్ నిర్మించిన ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డు
ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవే అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తి చేసి 2016లో దానిని ఆయనే ప్రారంభించారు. 2017లో ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవే సామాన్య ప్రజలు సంచరించడానికి అవకాశం ఇచ్చారు. అయితే అఖిలేస్ యాదవ్ 302 కిలోమీటర్ల ఎక్స్ ప్రెస్ హై నిర్మించారు.
రూటు మార్చిన బెంగళూరు బీజేపీ ఎంపీ
1947 నుంచి 2017 వరకు ఉత్తరప్రదేశ్ లో మొత్తం 467 కిలో మీటర్ల హైవే రోడ్లు నిర్మించారని, యోగి ఆదిత్యనాథ్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల సమయంలో ఉత్తరప్రదేశ్ లో 1, 321 కిలోమీటర్ల హైవే రోడ్లు నిర్మించారని, ఎవరు గోప్పో మీరే చెప్పాలని మాజీ సీఎం అఖిలేస్ యాదవ్ ను టార్గెట్ చేసుకుని తేజస్వి సూర్యా మరో ట్విట్ చేశారు. సోషల్ మీడియాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా కొంత సేపు నువ్వానేనా అంటూ ట్విట్లతో వార్ కొనసాగించడంతో అది కాస్త వైలర్ అయ్యింది.
అధికారం లక్షంగా పోరాటం
ఉత్తరప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రావాలని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పెద్దలు, ఎన్ డీఏ మిత్రపక్షాలు ఉత్తరప్రదేశ్ లో జోరుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసింది.