అసభ్యత: నగ్మాకు అదనపు భద్రత, హేమపై అమర్సింగ్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న నాటి ప్రముఖ కథానాయికలు హేమమాలిని, నగ్మాలకు అదనపు భద్రతకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగ్మా ఉత్తర ప్రదేశ్ మీరట్ నుండి కాంగ్రెసు పార్టీ తరఫున, హేమమాలిని మధుర నియోజక వర్గాల నుండి లోకసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
వీరు ప్రచారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హేమమాలిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలి వస్తున్నారు. వారిని అదుపు చేయడం ఉన్న సిబ్బంది వల్ల కావడం లేదు. మరోవైపు నగ్మాకు ప్రచారం సమయంలో రెండు మూడు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

ఈ నేపథ్యంలో వారికి అదనపు భద్రతను కోరారు. దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నగ్మా, హేమమాలినిలకు అదనపు భద్రతను కేటాయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం అంగీకారం తెలిపింది.
మరోవైపు, హేమమాలిని పైన ఆర్ఎల్డీ నేత అమర్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనకు డ్రీమ్ గర్ల్ వద్దని, రైతులు కావాలని అమర్ తన ప్రచారంలో వ్యాఖ్యానించారు. పారిస్కు చెందిన బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ ఉపయోగించే వారు మనకు వద్దని హేమమాలిని ఉద్దేశించి అన్నారు. దీనిపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమర్ వ్యాఖ్యల పైన తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications