విద్యార్థినులపై లైంగిక వేధింపులు: ప్రిన్సిపాల్,టీచర్ అరెస్ట్
పోలీసుల కథనం ప్రకారం.. చెవిటి, మూగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్న నిందితుడు తన కార్యాలయానికి విద్యార్థినులను పిలిపించుకుని చాక్లెట్ ఇచ్చి, తనను ముద్దు పెట్టుకోవాలని కోరేవాడు. అంతేగాక పలువురు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.
ఇది ఇలా ఉండగా పాఠశాలలోని మరో ఉపాధ్యాయుడు తనను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా అసభ్య, అశ్లీల ఫొటోలను చూపించేవాడని పోలీసులకు బాధిత బాలిక సంజ్ఞల ద్వారా వివరించింది. బాధిత బాలిక చెప్పిన దాన్ని మాటల్లోకి అనువదించే నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకున్నారు.
బాధిత బాలిక, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. జులై 7 వరకు కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలల ఏర్పాటు చేసిన సిసి టీవీ ఫుటేజీని తీసుకుని విచారణ జరుపుతామని చెప్పారు.