షాకయ్యా.. సిగ్గుపడుతున్నా.. ఐరాసలో భారత్ తీరుపై ప్రియాంక గాంధీ..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొన్నిరోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఇందులో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా గాజాలో అమాయక పౌరులు, పిల్లలు ఆహారం, తాగునీరు, వైద్యం అందక చనిపోతున్నారు. దీనిపై ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. గాజాకు సాయం అందించేందుకు కూడా ఇజ్రాయెల్ ఒప్పుకోకపోవడంపై పలు దేసాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఐరాస భద్రతామండలిలో ఇవాళ ఓ కీలక తీర్మానం ప్రవేశపెట్టింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య మానవతాకోణంలో సంధి చేసేందుకు వీలుగా ఐరాస భద్రతామండలిలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు.దీనిపై పలు దేశాలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. అనంతరం ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్ లో కూడా పలు దేశాలు పాల్గొన్నాయి. కానీ భారత్ మాత్రం అనూహ్యంగా దూరంగా ఉండిపోయింది. దీంతో ఇన్నాళ్లూ శాంతి కాముక దేశంగా చెప్పుకునే భారత్ ఈ శాంతి ఒప్పందానికి అనుకూలంగా ముందుకు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐరాసలో భారత్ అనుసరించిన వైఖరిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాందీ స్పందించారు. ఐరాసలో భారత్ అనుసరించిన వైఖరి తనను షాక్ కు గురి చేసిందని, దీనిపై ఈ దేశ పౌరురాలిగా సిగ్గుపడుతున్నట్లు ప్రియాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కంటికి కన్ను సిద్ధాంతం అనుసరిస్తే లోకమే గుడ్డిది అవుతుందంటూ మహాత్మాగాందీ చెప్పిన మాటల్ని కూడా తన పోస్ట్ లో ఆమె కోట్ చేశారు. భారత్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న వైఖరికి ఇది వ్యతిరేకమన్నారు.
“An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023
I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza.
Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down…
"మానవత్వంలోని ప్రతి చట్టాన్ని తుడిచిపెట్టి, ఆహారం, నీరు, వైద్య సామాగ్రి, కమ్యూనికేషన్ మరియు విద్యుత్తు లక్షలాది ప్రజలకు నిలిపివేయబడినప్పుడు నిలబడి మరియు మౌనంగా చూడటానికి నిరాకరించడం మరియు పాలస్తీనాలో వేలాది మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలు నిర్మూలించబడుతున్నారు. ఒక దేశంగా మన దేశం తన జీవితాంతం నిలబడిన ప్రతిదానికీ వ్యతిరేకంగా ఉంది" అని కాంగ్రెస్ నేత ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశరు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications