Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంజాబ్ లో కేజ్రీవాల్ పై వ్యాఖ్యల దుమారం: కుమార్ విశ్వాస్‌కు భద్రతపై కేంద్రం సమీక్ష

పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై, ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒకరోజు పంజాబ్ రాష్ట్రానికి సీఎం అవుతానని, లేదంటే పంజాబ్ రాష్ట్రాన్ని విడదీసి ప్రత్యేక ఖలిస్తాన్ దేశానికి ప్రధాని అవుతానని అరవింద్ కేజ్రివాల్ తనతో చెప్పాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలతో పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ దుమారం మరింత ముదిరింది.

ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నేత కుమార్ విశ్వాస్ భద్రతను కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది. కేంద్ర ఏజెన్సీ ద్వారా కేంద్రం ఆయనకు రక్షణ కల్పించవచ్చని అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి. ప్రభుత్వం కుమార్ విశ్వాస్ భద్రతను సమీక్షిస్తోందని, సమీక్ష ద్వారా మరియు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా అతనికి బెదిరింపులను పరిశీలిస్తుందని అందుకే అతని రక్షణ విషయంలో కేంద్రం సమీక్ష జరుపుతోందని వర్గాలు తెలిపాయి.

Punjab Elections 2022: Center review on security for Kumar Vishwas with khalistani Comments on Kejriwal

సమీక్ష తర్వాత కేంద్ర భద్రతా సంస్థ ద్వారా విశ్వాస్‌కు భద్రత కల్పించే అవకాశం ఉంది. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల హైవోల్టేజీ ప్రచారంలో కేజ్రీవాల్ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తున్నారని విశ్వాస్ ఆరోపించారు. విశ్వాస్ వ్యాఖ్యలు ప్రజలలో మరియు రాజకీయవర్గాలలో ప్రకంపనలు సృష్టించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌కు చెందిన మల్లికార్జున్ ఖర్గే, కేజ్రీవాల్‌ను వివరణ కోరారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు కుమార్ విశ్వాస్ చేసిన ప్రకటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేయాలని ఖర్గే అన్నారు. పంజాబ్ చాలా సున్నితమైన రాష్ట్రమని, ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఉంటుందని, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు కేజ్రీవాల్ పరిపక్వత, సున్నితత్వాన్ని ప్రదర్శించాలని అన్నారు.

పంజాబ్ ముఖ్యమంత్రి ట్విటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పంజాబ్ ముఖ్యమంత్రిగా, డాక్టర్ కుమార్ విశ్వాస్ వీడియో విషయంలో నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలని తాను ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థిస్తున్నానని వెల్లడించారు. రాజకీయాలు పక్కన పెడితే, పంజాబ్ ప్రజలు వేర్పాటువాదంతో పోరాడుతున్నప్పుడు భారీ మూల్యం చెల్లించుకున్నారని, ప్రధానమంత్రి ప్రతి పంజాబీ ఆందోళనను పరిష్కరించాలని చన్నీ కోరారు. ఇదిలా ఉంటే పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న (ఆదివారం) పోలింగ్ జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+