కాంగ్రెస్లో కుదుపు: 8మంది మంత్రులు రాజీనామా, వీరే
కేంద్రమంత్రి పురంధేశ్వరి పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి ఫ్యాక్స్ చేశారు.
రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్, గల్లా అరుణ కుమారిలు రాజీనామా బాట పట్టారు. వీరు పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు.
శైలజానాథ్, పార్థసారథి, కాసు, మహీధర్ రెడ్డిలు కేవలం పదవులకే రాజీనామా చేశారు. పార్టీకి చేయలేదు.
ఎమ్మెల్యేల్లో... రమేష్ బాబు (పెందుర్తి), అన్నె రాంబాబు (గిద్దలూరు), సురేష్ (యర్రగొండపాలెం), షాజహాన్ బాషా (మదనపల్లె) పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.
ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్ (భీమిలి), చింతలపూడి వెంకట్రామయ్య (గాజువాక), తోట త్రిమూర్తులు (రామచంద్రాపురం), దగ్గుబాటి వెంకటేశ్వర రావు (పర్చూరు) పార్టీకి రాజీనామా చేశారు.
ఎమ్మెల్యేలు సికె బాబు (చిత్తూరు) పదవికి రాజీనామా చేశారు.
టిడిపి ఎమ్మెల్యేల్లో...
రాష్ట్ర విభజనను నిరసిస్తూ టిడిపి ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. పయ్యావుల కేశవ్, పరిటాల సునిత, పల్లె రఘునాథ్ రెడ్డి, కందికుంట వెంకటప్రసాద్, పార్థసారథి, అబ్దుల్ ఘనీ, టివి రామారావు, చింతమనేని ప్రభాకర్, శివరామరాజు, బూరుగుపల్లి శేషారావులు పదవులకు రాజీనామా చేశారు.