రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రియాంక, రాబర్ట్ వాద్రా, రైహన్ వాద్రా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యాత్రలో తాజాగా, గురువారం రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమారుడు రైహన్ వాద్రాలు పాల్గొని ఆయనతోపాటు కదం కలిపారు. కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
'Agility Is Our Strength'.
— Kerala Pradesh Mahila Congress (@KeralaPMC) November 24, 2022
The Agile leader builds a Agile Team
- A team for whom no obstacle is too big.#BharatJodoYatra #BharatJodo#MileKadamJudeVatan pic.twitter.com/S68iaG2mg1
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు లోక్సభ, 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నుంచి యాత్ర సాగుతోంది. మనం కలిసి నడిస్తే మన అడుగులు బలంగా ఉంటాయి అని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రియాంకతోపాటు కాంగ్రెస్ నేతలు కమల్నాథ్ , సచిన్ పైలట్, దిగ్విజయ్ సింగ్ యాత్రలో పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 380 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అన్ని వర్గాల ప్రజలను తన యాత్రలో కలుస్తుండటం తనకు సంతోషంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తాను ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పుకొచ్చారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలను చుట్టేశారు. కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ఈ యాత్ర ప్రారంభమైంది.
भारत जोड़ो यात्रा में श्री राहुल गांधी जी के साथ कदम से कदम मिला रही हैं कांग्रेस महासचिव श्रीमती प्रियंका गांधी जी। #BharatJodoYatra pic.twitter.com/DE6YkeRiyz
— MP Congress (@INCMP) November 24, 2022
ఇటీవల మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి రాహుల్ యాత్ర ప్రవేశించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజస్థాన్లోకి రాహుల్ యాత్ర ప్రవేశిస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుర్హాన్పూర్, ఖండ్వా, ఖర్గోన్, ఇండోర్, ఉజ్జయినీ, అగర్ మల్వాలలో రాహుల్ యాత్ర కొసాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications