రాహుల్ గాంధియా, మజాకా ! ఎన్నికల ప్రచార ఫోటో పై జోకులు పేలుస్తున్న నెటిజన్లు !
ఎన్నికల వేళ ఒటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం రాజకీయ పార్టీలు పలురకాల జిమ్మిక్కులు,మ్యాజిక్లు చేస్తాయి . ఉన్నది లేనట్టు,లేనిది ఉన్నట్టు కనికట్టు మత్రాలకు సైతం వెనకాడరు. కాని అవి మాటల వరకైతే బాగానే ఉండేది, పార్టీల నిర్ణయాలు , ఆలోచనలు ఫోటోలు,వీడీయో రూపంలో వచ్చినప్పుడే వాటి నిజస్వరూపం బయటపడుతోంది. ప్రధానంగా సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుత రోజుల్లో విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రాజకీయా నాయకులు జిమ్మిక్కులు,మ్యాజిక్కులు బట్టబయలు అవుతున్నాయి.ఈనేపథ్యంలోనే తాజగా రాహుల్ గాంధి ఓ ముసలమ్మను గుండెలకు హత్తుకునే ఫోటో కూడ సోషల్ మీడియా లో పరుగులు పెడుతోంది. దీంతో ఆయనపై వేలాదిమంది నెటిజన్లు సెటైర్లు వేస్తూ సేద తీరుతున్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోతుందా ?
కనీస ఆదాయ పథకం ప్రచార ఫోటో
ఇటివల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పేదలకు కనీస ఆదాయ పథకం పేరుతో దేశంలోని ఐదుకోట్ల కుటుంభాలకు ప్రతి సంవత్సరం 72వేల రూపాయల ఇచ్చే స్కీంను ప్రకటించింది. కాగా దీన్ని ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఓ ముసలావిడను గుండెలకు హత్తుకున్న ఫోటో ఒకటి వివిధ పత్రికలతో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మార్ఫింగ్ లేక పూర్ ఎడిటింగ్ ఫోటో అనే అనుమానాలు
రాహుల్ గాంధి హత్తుకున్న పెద్దావిడా ఫోటో వరకు బాగానే ఉన్నా ఆమే వెనుక బాగం నుండి మరో మూడు వెళ్లు కనిపిస్తూ ఇతరుల చేయి కనిపిస్తోంది. దీంతో ఆఫోటో మార్ఫింగ్ దా లేక ,రియల్ ఫోటోనే ఎడిట్ చేయడంలో తప్పులు దొర్లాయా అనే నేపథ్యంలో నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ ఒక పీఆర్ ఎజెన్సి పెడితే బాగుంటుంది : ఢిల్లి బీజేపీ నేత
కాగా ఇదే అంశంపై ఢిల్లి బిజేపి యూనిట్ స్పోక్స్ పర్సన్ తాజిందర్ పాల్ సింగ్ ఆ ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ రాహుల్ గాంధి ఒక మంచి పీఆర్ ఎజెన్సిని పెట్టుకుంటే బాగుంటుందని సలహ ఇస్తూ పోస్ట్ చేశారు. దీంతో ఆయన పోస్టుకు సుమారు 13వేల మంది పలు రకాల కామెంట్స్ చేయడంతోపాటు , 6వేల రీట్వీట్స్ రావడంతోపాటు 14 వేల మంది లైక్ కొట్టారు, దీంతో ఆయన ఆమాకత్వాన్ని ప్రశ్నిస్తూ వేల పోస్టులు వెలువడ్డాయి. కాగా సంబంధిత ఫోటో షాప్ పై కూడ కామెంట్స్ వెలువడ్డాయి.