"Available Now": మాజీ ఆర్మీ ఛీఫ్ బుక్ పై రాహుల్ మరో షాక్-పెంగ్విన్ విలవిల..!
మాజీ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" పుస్తకంలోని అంశాల్ని పార్లమెంట్లో ప్రస్తావించేందుకు ప్రయత్నించి విఫలమైన తర్వాత బయటికి వచ్చి ఆ బుక్ ను నేరుగా ప్రదర్శించి విపక్ష నేత రాహుల్ గాంధీ (rahul gandhi) షాకిచ్చారు. దీంతో ఇప్పటికే ఈ పుస్తకం ప్రచురణ హక్కులు పొందిన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా (పీఆర్ హెచ్ఐ) బుక్కయింది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన పెంగ్విన్ తాము ఈ ప్రచురించని పుస్తకంలో అంశాల్ని ఎవరైనా బయటపెడితే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు రాహుల్ పై కేసు పెట్టారు.
Care to explain how did you announce the launch and accept pre-orders without printing and publishing the book, @PenguinIndia? https://t.co/E5XMgqEtMh pic.twitter.com/xrGeMvOIWZ
— Congress Kerala (@INCKerala) February 10, 2026
ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మరోసారి ఈ పుస్తకం వివాదంపై స్పందించారు. మాజీ ఆర్మీఛీఫ్ రాసిన పుస్తకంలోని అంశాల్ని, అసలు ఆ పుస్తకాన్ని బయటపెట్టిన తర్వాత నెలకున్న వివాదంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పెంగ్విన్, నరవణేల్లో ఎవరు కరెక్ట్ అని ప్రశ్నించారు. అంతే కాదు నరవణేను నమ్ముతారా పెంగ్విన్ ను నమ్ముతారా అని కూడా సూటి ప్రశ్న వేశారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక అంతా తికమక పడాల్సిన పరిస్ధితి.

#WATCH | On Delhi Police files FIR to investigate alleged circulation of former Army chief General MM Naravane's (Retd) unpublished book, LoP Lok Sabha Rahul Gandhi says," Here is a tweet from Mr Naravane which says -"Just follow the link to my book". The point I am making is -… pic.twitter.com/zeHbtzJpjJ
— ANI (@ANI) February 10, 2026
మాజీ ఆర్మీ ఛీఫ్ నరవణే తాము గతంలో కరోనా సమయంలో చైనాతో యుద్దం చేస్తున్నప్పుడు, ప్రత్యర్థి సైనికులు, యుద్ధ ట్యాంకులు మన సరిహద్దుల వరకూ వచ్చిన విషయాన్ని తాను కేంద్రానికి చెప్పినా స్పందించలేదని ఈ బుక్ లో రాసినట్లు రాహుల్ గాంధీ గతంలో తెలిపారు. దీంతో ఈ పుస్తకం కాస్తా వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఆర్మీ ఈ పుస్తకం రిలీజ్ కు అనుమతి ఇవ్వలేదని ప్రకటించింది. కేంద్రం కూడా ప్రచురించని పుస్తకాన్ని తీసుకొచ్చి ఏంటీ రచ్చ అని రాహుల్ ను పార్లమెంట్ లో అడ్డుకుంది. ఈ నేపథ్యంలో పెంగ్విన్ స్పందించడం, ఢిల్లీ పోలీసులు కేసు పెట్టడంపై స్పందించిన రాహుల్.. గతంలోనే ఈ పుస్తకం 2023లోనే ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని నరవణే పెట్టిన ట్వీట్ ను అందరికీ చూపించారు. దీంతో ఈ వివాదం మరో మలుపు తీసుకుంది.
-
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications