రాహుల్ ప్రయారిటీ వాయనాడే : ఓడిపోయిన అమేథితో కలిసిపోయానన్న స్మృతి
అమేథీ : అమేథీ ప్రజల మది దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. తాను ఓడిపోయిన అమేథీ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నానని పేర్కొన్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇక్కడి ప్రజల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తేడా ఇదే ...
మీరు వరుసగా మూడుసార్లు గెలిపించిన రాహుల్ గాంధీ .. అమేథీని మరచిపోయారు. ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈసారి కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తున్నా రాహుల్ ... అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు. అందుకోసమే వయనాడ్లో తొలుత నామినేషన్ వేశారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా .. నేను మీతోనే ఉన్నానని పేర్కొన్నారు. ఇక్కడినుంచి వరుసగా మూడుసార్లు గెలిచి ... అమేథీ ప్రజలను రాహుల్ అవమానిస్తున్నారని విమర్శించారు.

ఓటేయమని అడగరా ?
బుధవారం అమేథీలో రాహుల్ నామినేషన్ వేశారు. మంది మార్బలంతో వచ్చి, ఆర్భాటంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. కానీ ఆ తర్వాత ఇక్కడి ప్రజలను కనీసం ఓటు వేయమని కూడా చెప్పలేదు. ఇదెక్కడి న్యాయం. అమేథీపై రాహుల్ అనుసరిస్తోన్న వైఖరి సరికాదని విమర్శించారు స్మృతి ఇరానీ.












Click it and Unblock the Notifications