దేశం కంటే సల్మాన్తో స్నేహం ఎక్కువేం కాదు: రాజ్థాక్రే
థానే: పాకిస్థాన్ నటులు ఉగ్రవాదులు కాదంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్థాక్రే ఘాటుగా స్పందించారు. సల్మాన్ఖాన్తో స్నేహం దేశం కంటే ఎక్కువేమీ కాదని తేల్చి చెప్పారు. ఆ మాటకు వస్తే స్నేహం ఎప్పుడూ దేశం కంటే ఎక్కువకాదని స్పష్టం చేశారు.
ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన రాజ్థాక్రే మాట్లాడుతూ.. 'సల్మాన్ పాక్ నటులకు మద్దతుగా మాట్లాడినప్పుడు నేను స్పందించను అనుకున్నారు. కానీ, విషయం దేశం, ప్రభుత్వం వరకు వస్తే స్నేహితులు అని కూడా చూడం. అయినా సల్మాన్ఖాన్కు అక్కడ తన సినిమాలు బాగా ఆడతాయన్న విషయంపైనే ధ్యాస ఉంది' అని వ్యాఖ్యానించారు.

యూరీ దాడి నేపథ్యంలో పాక్ నటులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న ఎంఎన్ఎస్ హెచ్చరికను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, శ్యామ్బెనగల్లు తప్పుపట్టారు. పాకిస్థానీ నటులను బహిష్కరించడం ఉగ్రవాదానికి పరిష్కారం కాదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సల్మాన్ మరో అడుగు ముందేకేసి 'పాక్ నటులు చట్టబద్ధమైన వీసాలు, వర్క్పర్మిట్లతోనే బాలీవుడ్లోకి వచ్చారు' అని వాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే రాజ్ థాక్రే పై వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా ఉండగా, 'ఎంఎస్ ధోనీ' చిత్రాన్ని పాకిస్థాన్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications