Rajasthan Polls: డిసెంబర్ 3న రాజస్తాన్ నుంచి కాంగ్రెస్ మాయం-ప్రధాని మోడీ ధీమా..
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఒకటైన రాజస్తాన్ లో ప్రధాని మోడీ ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని భరత్ పూర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. తమ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీల్ని నిలబెట్టుకుంటుందని హామీ ఇచ్చారు. ఇది మోడీ గ్యారంటీ అన్నారు. రాజస్తాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నేరస్తులను చూసీ చూడనట్లుగా వదిలేసి మహిళలపై దాడులు, మతఘర్షణలకు కారణమైందని ప్రధాని మోడీ విమర్శించారు.
రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను ప్రధాని మోడీ జాదూగర్(మాయగాడు)గా అభివర్ణించారు. రాష్ట్రంలో డిసెంబర్ 3న(ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు) కాంగ్రెస్ పార్టీ మాయం కావడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని, మరోవైపు రాజస్థాన్లో గత ఐదేళ్లలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసన్నారు. రాజస్థాన్ను అవినీతి, అల్లర్లు, నేరాల్లో కాంగ్రెస్ అగ్రగామిగా నిలిపిందన్నారు. అందుకే రాజస్థాన్ మాంత్రికుడికి (గెహ్లాట్) ఓట్లు పడవన్నారు.

అలాగే కాంగ్రెస్ ఎక్కడ వచ్చినా ఉగ్రవాదులు, నేరగాళ్లు, అల్లరి మూకలను వదులుతారని ప్రధాని మోడీ విమర్శించారు. కాంగ్రెస్కు బుజ్జగింపులే సర్వస్వం అన్నారు. మీ ప్రాణాలను పణంగా పెట్టినా బుజ్జగింపుల కోసం కాంగ్రెస్ ఎంతవరకైనా వెళ్లగలదని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో మహిళలు, దళితులపై అత్యధికంగా నేరాలు జరిగాయన్నారు. కాబట్టి ఈసారి దళితులు కాంగ్రెస్ కు ఓటు వేయబోరన్నారు.
రాజస్తాన్ లోని 200 అసెంబ్లీ సీట్లకు ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇప్పటికే పలు ఒపీనియన్ పోల్స్ ఈసారి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని తేల్చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోసారి గెలుస్తామనే ధీమాలో ఉంది. రాష్ట్రంలో ఐదేళ్ల కోసారి ప్రభుత్వాల్ని మార్చేసే సంప్రదాయం ఉండటంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications