భారీ బిల్లు షాక్.. పేదవారికి ఉచితంగా వాదిస్తా: కేజ్రీవాల్కు జెఠ్మలానీ
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదించేందుకు ఎలాంటి ఫీజు తీసుకోనని, పేదలకు ఉచితంగా వాదిస్తానని లాయర్ రాం జఠ్మలానీ చెప్పారు.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదించేందుకు ఎలాంటి ఫీజు తీసుకోనని, పేదలకు ఉచితంగా వాదిస్తానని లాయర్ రాం జెఠ్మలానీ చెప్పారు.
ఈ కేసులో రూ. 3.86కోట్ల బిల్లును కేజ్రీవాల్కు జెఠ్మలానీ పంపించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు.
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ విషయంలో అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేయడంతో కేజ్రీవాల్పై ఆయన పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ తరఫున ప్రముఖ లాయర్ జెఠ్మలానీ వాదిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటివరకు వాదించినందుకు జఠ్మలానీ రూ. 3.86 కోట్ల బిల్లును కేజ్రీవాల్కు పంపించారు. కేసు ఒప్పుకున్నందుకు రూ. కోటి, కోర్టులో హాజరైన ప్రతిసారి రూ. 22లక్షల చొప్పున బిల్లు వేశారు.
అయితే ఈ బిల్లును తాను వ్యక్తిగతంగా కట్టలేనని, ప్రభుత్వ ధనాన్ని వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్కు లేఖ రాశారు. దీంతో ఆయన నిపుణుల కమిటీని అడిగి నిర్ణయం తీసుకుంటానన్నారు.
అయితే కేజ్రీవాల్ లేఖ పంపడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే తొలుత జెఠ్మలానీ ఎటువంటి ఫీజు తీసుకోనని చెప్పి, ఇప్పుడు బిల్లులు పంపిస్తున్నారని ఏఏపీ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో రాం జఠ్మలానీ స్పందించారు. తన ఫీజును ఢిల్లీ ప్రభుత్వం లేదా కేజ్రీవాల్ చెల్లించకపోయినా తాను ఆయన తరఫున వాదిస్తానని తెలిపారు. పేదల కోసం తాను ఉచితంగా వాదిస్తానని, కేజ్రీవాల్ను తన పేద క్లయింట్లలో ఒకరు అనుకుంటానని చెప్పారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications