రామ మందిరంపై సాక్షి సంచలన వ్యాఖ్యలు: ములాయం లేదా మాయావతి కడతారా?
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలోనే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని అన్నారు.
'రామ మందిరం నిర్మాణం బీజేపీ హయంలో జరగకపోతే కాంగ్రెస్ పాలనలో జరుగుతుందా? ములాయం లేదా మాయావతి కడతారా? బీజేపీ పాలనలోనే రామమందిరం నిర్మిస్తాం. ఈరోజు కాకపోతే రేపు. రేపు కాకపోతే తర్వాత రోజు. మా ప్రభుత్వానికి ఏడాది మాత్రమే పూర్తయింది. ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉంటాం' అని సాక్షి మహరాజ్ అన్నారు.
నరేంద్ర మోడీ సర్కారు కూడా కూలిపోతుందని శనివారం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) జాతీయ కార్యదర్శి సురేంద్ర జైన్ వ్యాఖ్యానించారు. సురేంద్ర జైన్ మాట్లాడుతూ గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన భారీ మెజార్టీ కేవలం దేశాన్ని అభివృద్ధి చేయడం వల్ల వచ్చిందని కాదన్నారు.

కీలక అంశాల(రామ మందిరం)ను పరిష్కరిస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయంలో మీరు వెనకడుగు ఎలా వేయగలరు? అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకుంటుందని భావిస్తున్నామని అన్నారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మించకపోతే ప్రధాని మోడీ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. సురేంద్ర జైన్ వ్యాఖ్యల నేపథ్యంలో రామ మందిరం నిర్మాణంపై సాక్షి మహారాజ్ ఆదివారం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications