అంబరీష్పై ఫిర్యాదు: లేదన్న రమ్య, వదలొద్దని డైరెక్టర్
బెంగళూరు/న్యూఢిల్లీ: ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన ప్రముఖ నటి, మాజీ ఎంపి రమ్య... తన ఓటమికి మంత్రి అంబరీష్ కారణమని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
రమ్య తన ఫిర్యాదులో కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ, అంబరీష్ మధ్య ఉన్న మనస్పర్థల వల్ల ఆపార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారని, ముఖ్యంగా అంబరీష్ అనుచరులు ప్రత్యర్థులతో చేతులు కలిపి తనను ఓడించారని, ఇవన్నీ తెలిసినా అంబరీష్ మౌనంగా ఉన్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే, వార్తలను రమ్య ఖండించారు. తాను అంబరీష్ పైన లేదా ఎస్ఎం కృష్ణ పైన కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. రమ్య ఈ నెల 19న ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. దీంతో ఆమె ఫిర్యాదు చేసినట్లుగా ఊహాగానాలు వచ్చాయి.
కాగా, నటి రమ్య గత ఏడాది ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి మాండ్య నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోను అదే నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కానీ స్వల్ప ఓట్లతో ఆమె ఓడిపోయారు.
రమ్యకు దర్శకుడి సూచన
ప్రముఖ దర్శకులు నాగతిహల్లి.. రమ్యకు సూచనలు చేశారు. సినిమాలను వదలవద్దని సూచించారు. రాజకీయాలను, సినిమాలను బ్యాలన్స్ చేస్తూ వెళ్లాలని రమ్యకు ఆయన హితవు పలికారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications