వామ్మో ఘోరం: యువతిపై యాసిడ్తో దాడి, ఎస్సై భార్య సహా మరో ఇద్దరు కలిసి.. కాలు, చేతికి తీవ్రగాయం..
యువతి అని కూడా చూడలేదు. యాసిడ్తో దాడి చేయడంతో ఆమె చేయి, కాలికి గాయమైంది. ఓ పోలీసు అధికారి భార్య దగ్గరుండి మరీ దాడి చేశారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా యువతిపై తప్పుడు కేసు నమోదు చేసింది. దీంతో జైలుకెళ్లిన యువతి.. కొద్దిరోజుల కిందట బయటకొచ్చారు. ఆమె వచ్చారని తెలుసుకొని.. పథకం ప్రకారం యాసిడ్తో దాడి చేశారు.
మీరట్ సీనియర్ ఎస్పీ నివాసానికి కూతవేటు దూరంలో యువతిపై యాసిడ్ దాడి జరగడం కలకలం రేపుతోంది. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా తనపై తప్పుడు కేసు ఎస్సై భార్య నీతు పెట్టారని బాధితురాలు ఆరోపించారు. తనతోపాటు తన సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. 2018లో ఎస్సై నరేంద్ర తనతో తప్పుగా ప్రవర్తిస్తే కేసు నమోదు చేశానని.. దానికి వ్యతిరేకంగా ఎస్సై భార్య మరో కేసు ఫైల్ చేసిందని వివరించారు.
తనపై గతంలో కేసు నమోదు చేయడమే కాకుండా దాడిచేసిన నీతు సహా మరో ఇద్దరిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని సివిల్ లైన్ సర్కిల్ అధికారి సంజయ్ దేశ్వాల్ ధృవీకరించారు. వీరి మధ్య వైరం రెండేళ్ల నుంచి అర్థమవుతోందని చెప్పారు. బాధిత యువతి పల్లవ్పురంలో ఉంటుండగా.. 2018లో బాధితురాలు ఎస్సైపై లైంగికదాడి కేసు నమోదు చేయగా.. ప్రతీగా అతని భార్య యువతిపై కేసు పెట్టింది. కేసులో బాధితురాలు జైలుకు కూడా వెళ్లింది. బెయిల్పై బయటకు వచ్చిన.. ఆమెపై దాడి చేశారని తెలిపారు. లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై నరేంద్ర ప్రస్తుతం బెహ్సుమా పోలీసు స్టేషన్లో పనిచేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని.. నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసు అధికారి సంజీవ్ దేశ్వాల్ తెలిపారు.