రేప్ కేసులో జైలు శిక్ష: ఫర్లాఫ్ కట్
ముంబై: అత్యాచార కేసులో దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యాచారం కేసులో జైలు శిక్షపడిన ఖైదీలకు ఇక మీదట సెలవులు (ఫర్లాఫ్) ఇవ్వరాదని నిర్ణయించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం సవరించిన జైలు మాన్యువల్ లో ఈ మేరకు నిబంధనలను చేర్చారు. కొత్తగా 30 సవరణలతో కూడిన జైలు మాన్యువల్ ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు నోటిఫై చేశారు. ఇందులో రేప్ కేసులో శిక్షపడిన వారిని ఫర్లాఫ్ కు అనర్హులను చేశారు.

సవరించిన మాన్యువల్ ను ప్రింటింగ్ కు పంపించారు. ఈ నియమాలను మహారాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ లో పెట్టనున్నారు. ఫర్లాఫ్ కింద ఓ ఖైదీకి ఏడాది మొత్తానికి 28 సెలవులు ఉంటాయి. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఒకే సారి 14 రోజులు సెలవు తీసుకునే వెసులు బాటు ఉంది.
జైళ్ల శాఖ అధికారులు అనుమతి ఇస్తే మరో 14 రోజులు సెలవు తీసుకోవచ్చు. అయితే ఇక మీదట మహరాష్ట్రలో అత్యాచారం కేసుల్లో శిక్షపడిన వారు ఫర్లాఫ్ తీసుకోవడానికి వీలులేదు. అదే విధంగా పెరోల్ మంజూరు పైనా కఠిన నిబంధనలు చేర్చారు. త్వరలో ఈ నిబంధనలు అమలు కానున్నాయి.












Click it and Unblock the Notifications